సహజంగా అందరికి బ్లాక్ టీ, అల్లం టీ, తేయాకు టీ, గ్రీన్ టీ.. ఇలా రకరకాల టీల గురించి తెలుసు. మన పెరటిలో సువాసనలు వెదజల్లే మల్లె పువ్వుతో కూడా టీ తాయారు చేయొచ్చు. మల్లెపూలతో చేసే టీలో ఆరోగ్య రహస్యాలున్నాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇప్పుడు మనం ఈ ప్రత్యేకమైన టీ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
మల్లె పూవు టీ తయారు చేయడానికి ముందుగా తాజాగా ఉన్న మల్లె పూవులను, మల్లె ఆకులను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి పొడి ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత పొడి చేయాలి. ఆ చూర్ణాన్ని ఒక స్పూన్ మోతాదులో తీసుకొని ఒక కప్ వాటర్ తో కలుపుకొని బాగా వేడి చేయాలి బాగా మరిగిన తర్వాత గోరు వెచ్చగా చల్లార్చుకొని తాగాలి. వగరుగా అనిపిస్తే ఆ టీలో తేనే కలుపుకొని కూడా తాగవచ్చు. ఈ మల్లెపూల టీ తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దీని వల్ల హృదయసంబంధ వ్యాధులను, పక్షవాతాన్ని దరిచేరనివ్వదు.
లావు తగ్గాలనుకునే వారికి ఈ టీ మంచి రెమిడీ. తొందరగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. గోరు వెచ్చగా ఉన్న ఈ టీని పుక్కిలిస్తే చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం రాకుండా చేస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. కండరాల నొప్పులను, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాదు శృంగార భావాలు పెంచుతుంది. టీ వ్యసనపరులు ఈ టీ తాగకపోవడం మంచిది. ఎందుకంటే దీనిని తాగడం వల్ల ఎలాంటి రిలాక్సేషన్ ఉండదు. ఖాళి కడుపుతో కూడా ఈ టీ తాగకూడదు, ఎందుకంటే గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.