Fruits: సాధారణంగా మనం మార్కెట్లో మనకు కంటికి ఇంపుగా కనిపించే పండ్లనే కొనుగోలు చేస్తాం. అయితే వాటిని సహజ సిద్ధమైన ఎరువులు వేసి పండించారా,రసాయనాలు వేసి పండించారా, అన్నది మనకు తెలియదు. కానీ వాటిపై ఉండే స్టిక్కర్లు మనకు ఆ విషయాన్ని చెప్తాయి. మరి ఏ నంబర్ఉండే పండ్లను ఎలాంటి పద్ధతిలో పండించి ఉంటారో తెలుసుకుందాం.
పండ్లపై వేసే స్టిక్కర్ల మీద నాలుగు అంకెల తో నెంబర్ ఉండి అది 3, లేదా4 నెంబర్ తో మొదలయినట్టయితే ఆ పండ్లను సహజసిద్ధమైన ఎరువులు,కృత్రిమ రసాయనాలు, వాడి పండించారని అర్థం . ఇలాంటి పండ్లను తినవచ్చు. అయితే రసాయనాలు కూడా వాడారు కనుక వాటిని శుభ్రంగా కడిగినతర్వాతే తినాలి. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది.పండ్లపై వేసిన స్టిక్కర్ మీద ఐదు అంకెల తో నెంబర్ ఉండి, అది 9తో మొదలై ఉంటే అప్పుడు ఆ పండ్లు పూర్తిగా సేంద్రియ ఎరువులు వాడి అత్యంత సహజ సిద్ధంగా పండించారని గుర్తు. ఈ పండ్లు తినడం వలన మన శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదు .ఇవి మన ఆరోగ్యానికి పూర్తి సురక్షితమైనవిగా గుర్తించాలి. ఇలాంటి పండ్లనే మనం తినటానికి ఎంచుకోవాలి.
పండ్లపై వేసే స్టిక్కర్ మీద ఐదు అంకెల తో నెంబర్ ఉండి, అది 8తో మొదలైతే ఆ పండ్లను జన్యువుల మార్పిడితో పండించారని అర్థం. ఇలాంటి పండ్లు అసలు వాడకూడదు. వీటితో ఆరోగ్యం పాడటం తో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను వెంటతెచ్చుకున్నటు అవుతుంది.దీనితో పాటు తెలుసుకోవాలిసిన విషయం ఏమిటంటే.. మనకు యాపిల్ వేరే రాష్ట్రాల నుండి దిగుమతి జరుగుతుంది. వాటిని వ్యాపారులు రక రకాల కెమికల్ తో కడిగి స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఆ యాపిల్ చూడటానికి నిగ నిగ లాడుతూ మంచి రంగుతో ఆకర్షణీయంగా వుండి ఎంత రేటు అయినా తినాలనిపిస్తుంది. కాబట్టి మోసపోకుండా తగు జాగ్రత్త తో పండ్లు ఎంపిక చేసుకుని, బాగా శుభ్రం చేసుకుని… తొక్క తీసేసి తినడం మంచిది.