Kidney stones: ప్రస్తుతం చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే మనిషి శరీరంలో క్యాల్షియం ఫాస్పేట్ అక్సలైట్ రసాయనాలు పేరుకుని పోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లుగా మారతాయి. అంతే కాకుండా క్యాల్షియం టాబ్లేట్ లను ఎక్కువగా వాడటం వల్ల కూడా అది క్యాల్షియం ఆక్సలేట్ గా మారి రాళ్ళు ఏర్పడతాయి. దీనిని ఆయుర్వేద పరిభాషలో మూత్రస్మరి అని పేర్కొంటారు.
మూత్ర పిండాళ్లలో రాళ్లు ఏర్పడటం వల్ల విపరీతమైన నొప్పి, జ్వరం, వాంతి, ఆకలి లేకపోవడం, నిత్రలేకపోవడం, మూత్రం పోసే సమయంలో మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్య పరిష్కారానికి ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ (సర్జరీ) తో వీటిని తొలగించుకున్నా కొన్ని సార్లు మళ్లీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ సమస్య పరిష్కారానికి మన పెరట్లో దొరికే కొండపిండకు దివ్యౌషదంగా పని చేస్తుంది. దీనిని కొన్ని ప్రాంతాల్లో తెలగపిండి ఆకు అని కూడా పిలుస్తుంటారు. సంస్కృతంలో దీనిని పాషాణ భేది అని పిలుస్తుంటారు.
Kidney stones: దీన్ని ఎలా వాడాలంటే..?
ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్న ఈ మొక్క ఆకును చాలా చోట్ల పప్పుతో కలిపి తింటారు. ఈ ఆకులను ఎండ బెట్టి దాన్ని చూర్ణంగా చేసుకోవాలి. ఆ చూర్ణంను రెండు టీ స్పూన్ లను అరగ్లాసు నీళ్లలో కలిపి ప్రతి రోజు ఉదయం తీసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీలో రాళ్లు చాలా వరకు కరిగిపోతాయి. అంతే కాకుండా దీని ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి ఆ తరువాత దాన్ని వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపున 20 రోజుల పాటు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
దాని ఆకులను నేరుగా ఉదయం పూట నేరుగా కూడా తినవచ్చు. ఈ ఆకు వల్ల ఎటువంటి దుష్పలితాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉండవు. వీటిని కిడ్నీలో రాళ్లు లేని వారైనా తినవచ్చు. ఈ ఆకును తీసుకోవడంతో పాటు ప్రతి రోజు నాలుగు నుండి అయిదు లీటర్ల నీటిని తాగాలి.
పత్యం
కొండ పిండాకు తీసుకునే వారు, కిడ్నీలో రాళ్లు ఉన్న వారు పాలకూర, సోయాబీన్, టమోటా, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. ఉప్పు మితంగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు.