Kids: దంతాలను కాపాడుకుంటే అవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. దంతక్షయం, చిగుళ్ల సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.. దంత సమస్యలు రాకుండా ఉండాలంటే చిన్నప్పటినుంచే దంతాలపై శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి.. పిల్లలకు కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఇవ్వడం వలన దంత సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.. ఎటువంటి ఆహారాలు ఇస్తే దంతాలు పాడవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
చక్కెర ఎక్కువగా ఉండే మిఠాయిలు, తీపి పదార్థాలు, చాక్లెట్లు, తీపి పానీయాలు, బాగా పొట్టుతీసిన ధాన్యాలలోని పిండిపదార్థాలు పళ్లకు హాని చేస్తాయి. వీటిల్లోని చెక్కెర అలాగే ఉండిపోతే పంటి మీద ఉండే ఎనామిల్ అరిగిపోతుంది. అక్కడ బ్యాక్టీరియా పెరిగి పళ్లు పుచ్చిపోతాయి. అందువల్ల చాక్లెట్లు, స్వీట్స్ వంటివి ఎక్కువగా తినకుండా చూసుకోవాలి. అలాగే తిన్న వెంటనే నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.
పిల్లలకు కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా ఇవ్వకూడదు. ఈ డ్రింక్స్ లో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పంటి ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. దంతాలను సున్నితంగా చేస్తుంది. ఫ్రిడ్జ్ లో ఎక్కువసేపు నిల్వ ఉన్నా ప్యాకింగ్ ఫ్రూట్ జ్యూస్ పిల్లల ఆరోగ్యానికి హానికరం. విటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్లను తింటే అవి దంతాలపై చెడు ప్రభావం చూపుతుంది. నారింజ పండు తీసుకోవచ్చు . కానీ మిగతా పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. పొటాటో చిప్స్, పాప్ కార్న్ వంటివి తీసుకుంటే అవి పళ్లలో ఇరుక్కుపోయి దంత సమస్యలను కలిగిస్తుంది.