ప్రస్తుత సీజన్ లో ప్రజలు ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలోనే ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతుంటారు.ఈ సీజనల్ వ్యాధులను తట్టుకోవాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తప్పనిసరిగా ఉండాలి. అందుకే కివి పండును తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కివి పండు తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
కివి పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
కివి పండు తింటే డెంగ్యూ రోగుల్లో ప్లేట్లెట్ కౌంట్ అనేది పెరుగుతుంది.అలాగే కివి పండులో రోగ నిరోధక శక్తిని పెంచే విలువైన పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి.ముఖ్యంగా విటమిన్ల కొరతను అధిగమించడంలో కివి అద్భుతంగా పని చేస్తుంది.
రోగనిరోధక శక్తి :
కివీ పండులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కివి పండును తింటే శరీరానికి అవసరమైన విటమిన్ సి అందుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం ఉదర సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. కివిలో ఉండే విటమిన్ సి కంటెంట్ నారింజ, నిమ్మకాలయ కంటే రెట్టింపు ఉంటుంది. ఇందులో విటమిన్ సితో పాటు, యాంటీ-ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. కివీపండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా కూడా తగ్గుతుంది.
ఇన్ఫెక్షన్స్ తగ్గుదల :
కివి లో విటమిన్ ఇ, సి, విటమిన్ కె, విటమిన్ ఎ లతో పాటుగా పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది.కివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కివిలో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, బరువు పెరుగకుండా సహకరిస్తుంది.కివి లో చెక్కర కంటెంట్ చాలా తక్కువగా ఉంది. ఇది మధుమేహ నియంత్రణకు కూడా సహాయపడుతంది. కివీఫ్రూట్ సూక్ష్మజీవులతో పోరాడి సీజనల్ గా వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఈ పండును రోజూ ఒకటి చొప్పున తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడుకుండా రక్షణ పొందవచ్చు.