‘పిచ్చుక పై బ్రహ్మాస్త్రం’ అన్న మాట మనం చాలాసార్లు వేనే ఉంటాం. ప్రత్యక్ష ఉదాహరణ కావాలంటే ప్రస్తుతం మన జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పేఅని చెప్పవచ్చు . పిచ్చుక జాతి అంతరించబోనుంది. అతి వేగంగా పట్టణీకరణ, మాయమవుతున్న పచ్చదనం, రసాయనాలతో ఆహార ధాన్యాలు, పళ్లు ఉత్పత్తి చేయడం పిచ్చుకలు కనుమరుగవడానికి కారణాలు గా చెప్పవలిసి ఉంది. సెల్యూలర్ టవర్ల నుంచి పుట్టే అయస్కాంత తరంగాలు పిచ్చుక జాతికి ముప్పుగా మారాయి.
మనుషుల చేత తయారుచేయబడిన పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేయడంవలన పిచ్చుక జాతిని కొంత వరకు సంరక్షించుకో గలమని శాస్త్రవేత్తలు చెప్తున్నా సలహా. గతం లో ఊర పిచ్చుకలు పల్లెటూర్లల్లో ఎక్కువగా కనిపించేవి . రైతు లు పిచ్చుక ల ఆహారం కొరకు వరి కంకులను సేకరించి గుత్తులుగా కట్టి ఇంటి చూరుకు వేళ్ళాడే విధం గా ఉంచే వారు . ప్రస్తుత కాలం లో పంటలు లేక వాటికీ ఆహారం దొరకక అనేక కారణాల వలన పల్లెల్లో పిచ్చుకలు కనబడడం లేదు. ఇన్ని కారణాల వలన ఆ జాతి అంతరించిపోయే దశకి చేరుకుంది. నిజమైన పిచ్చుక ల్లో ఇంచుమించు 35 జాతులున్నాయి.
గుప్పెడు గింజలు తింటూ అటు ఇటూ తిరుగుతూ మనకు హాని కలిగించే ఎన్నో రకాల క్రిమి కీటలకాలను నాశనం చేస్తాయి. పిచ్చుకలు పొలాల్లో తిరగడం వల్ల క్రిమీకీటకాలు నాశనమై పంటలు బాగా చేతికొస్తాయి. వాటి కిలకిలరావాలు మనలోమానసిక ప్రశాంతని పెంచుతాయని చెబుతున్నారు నిపుణులు. మనకు ఇంత మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాలంటే, కాలుష్యం తగ్గేలా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి అది అందరి బాధ్యత. చెట్లను నరికివేయడం కూడా నివారించాలి. పిచ్చుకల కోసం ఆవాసాలు ఏర్పాటు చేసి ఆహారం, నీటిని ఏర్పాటు చేయాలి. ఇలా కొన్నికొన్నిపద్ధతులు పాటించడం వల్ల పిచ్చుకల జాతిని కాపాడుకో గలుగుతాం .