రొమ్ము క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా అందరిలో ఆందోళన పుట్టిస్తుంది . ఈ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూపోతోంది. రొమ్ము క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశ గుర్తిస్తే ప్రాణాల ను కాపాడుకోవచ్చని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ సునీత తెలిపారు. ఈ రొమ్ము క్యాన్సర్ చికిత్స లో ప్రధానం గా కీమో థెరపీ ఇచ్చి బాధితులకు ఉపశమనాన్ని కల్గిస్తున్నారు. ఇక వివరాలలోకి వెళ్తే…
స్త్రీల ను రొమ్ము క్యాన్సర్ బయపెడుతుంది . సరైన అవగాహనలేకపోవడం వలన ఎంతో మంది ప్రాణా ల మీదకి వస్తుంది . రొమ్ము క్యాన్సర్ కి సంబందించిన లక్షణాలు తెలుసుకోండి..రొమ్ము ఆకారం లో మార్పు కనిపిస్తే మాత్రం అశ్రద్ద చేయవద్దు. అకారణంగారొమ్ము పరిమాణంపెరిగిన ,రొమ్ము నారింజ, ఎరుపు రంగు లోకి మారినా అనుమానించవలిసిందే. అదే విధంగా వాటినుండి స్రావాలు వస్తుంటే సమస్యను తేలిగ్గాతీసుకోవడానికి అస్సలు వీలు లేదు. పైవాటిల్లో ఎ ఒక్క లక్షణం కనిపించిన ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్నిసంప్రదించాలి. పండ్లకే రాజు అయిన మామిడి పండు ఎన్నో పోషక విలువలు కలిగి ఉంది. తాజాగా జరిగిన ఓక పరిశోధన లో ఆసక్తికరమైన విషయాలుబయట పడ్డాయి .
అదేంటంటే మామిడి పండు రొమ్ము క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. మామిడిపండు పోలిఫినోల్ అనే రసాయనం కలిగి ఉంటుంది. అందువల్ల ప్రొస్టేట్, లుకేమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల మీద ప్రభావం చూపినట్లుతెలిసింది . ఇంకా రొమ్ము , పెద్ద పేగ్ల కి వచ్చే క్యాన్సర్ కణాల ని నిరోధించి నాశనం చేయడంలో మామిడిపండ్లు అద్భుతమైన ప్రభావం చూపినట్లు తెలిసింది.
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.