రోజా పువ్వు ల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . రోజా పూలలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది . రోజా పూల రేకులలో సూక్ష్మక్రిములను పోగొట్టే శక్తి వుంది. రోజా పువ్వులనుండి వచ్చే వాసన ఒత్తిడిని పోగొడుతుంది. ఒత్తిడి లో వుండే వారు రోజ్ పువ్వులను వాసన చూస్తూ ఉంటే ఉపశమనం గా ఉంటుంది. అంతే కాదు బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ రోజా పూల రేకులను తినవచ్చు.
నేరుగా కాకపోయిన పూలరేకులను ఇతర ఆహారం తో కలిపితినవచ్చు. అలా తిన్న ఫలితం గా బరువు తగ్గుతారని పలు అధ్యయనాలు తేల్చాయి. రోజా పువ్వులను తింటే శరీరం లో మెటబాలిజం చక్కగా పనిచేస్తుంది. అంటే అన్ని అవయవాల పని తీరు బాగా మెరుగవుతుంది.
రోజా రేకుల ను ప్రతి రోజూ గుప్పెడు తింటూటే అవి మన శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి . దాని ద్వారా రక్త శుద్ధి జరుగుతుంది. అంతేకాక సహజంగానే వీటికి మగవారిలో వీర్యవృద్ధిని పెంచే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు .
రోజాల లో వుండే సి-విటమిన్ పాడైన కణాల కు పునరుజ్జీవంపొందేలా చేస్తుంది. ఈ రేకుల వలన వ్యాధి నిరోధక శక్తిపెంచే గుణముకూడా ఉంది. స్త్రీలలో నెలసరి సమస్యల తో బాధ పడేవారు రోజాల రేకులను తింటేమంచి ఫలితం పొందవచ్చు. సంతాన సాఫల్యనికి సంబందించిన సమస్యలకు కూడా ఇవి తగ్గిస్తాయి. కాని ముందుగా చేయవలిసిన పని ఏమిటంటే రోజా ల రేకు లను బాగా కడిగిన తర్వాతే తినడానికి ఉపయోగించాలి. లేదంటే వాటిపై చల్లే పురుగు మందులువలన ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము ఎక్కువ. మైగ్రేన్ తలనొప్పితో బాధ పడేవారు రోజ్ ఆయిల్తో మర్దన చేసుకుంటే ఎంతో ఉపశమనం కలుగుతుంది.