మగవారిలో కొంతమంది భార్యలు తమకు నచ్చిన అందం తో లేకపోతేనో లేదా శృంగారంలో తమను సంతృప్తి పరచలేకపోతె లేదా ఇంకా ఏదైనా కారణం చేతయినా తమ శృంగార పరమయిన కోర్కెలు తీర్చుకోవడానికి, వేరే స్త్రీ ల తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇదే పద్దతిని కొంత మంది స్రీలు కూడాఅనుసరిస్తున్నారు. కొందరు ఇలాంటి అక్రమ సంబంధాలు ఎక్కువకాలం కొనసాగించలేక తాత్కాలికం గా ఎవరైనా దొరికితే బావుండునని చూస్తుంటారు.
ఇలాంటి వారి అవసరాలనుఅదునుగా తీసుకుని కొన్ని ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఒకవైపు ఉద్యోగాల కోసం చూస్తున్న యువతను.. మరోవైపు ఇలా తమ కోరిక తీరితే బాగుండు అనుకునేవాళ్లను ఒకేసారి మోసం చేస్తున్నారు.ఓక చిన్న మెసేజ్ తో, వెబ్ సైట్ల ద్వారా ఈ మధ్యకాలంలో దేశంలోని పలు నగరాల్లో దందా మొదలైంది.ఆంటీలను శృంగారం తో తృప్తి పరిస్తే లక్షలు ఇస్తామంటూ యువత ను ఆకర్షించడం… మీ శృంగార కోరికలు తీర్చుకోవాలనుకుటున్నారా? అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారంటూ ఇటు స్త్రీ కు ఒకేసారి వల వేస్తున్నారు.
ముందు కొంత డబ్బుచెల్లిస్తే .. కస్టమర్ కి సంబందించిన వివరాలు ఇస్తామంటూ యువత దగ్గర.. ముందు గా డబ్బులు కడితే.. కత్తిలాంటి కుర్రాళ్ళు మీ ముందుంటారు అంటూ ఆ మహిళల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఇలాంటి వాటితో మోసపోయిన వారు ఎవరూ ముందుకు వచ్చి కంప్లైంట్ చేయలేరు అనే ధైర్యం తో వాళ్లు ఈ దందాకి తెగబడడం గమనించవలిసిన విషయం. తాజాగా ఇలాంటి దందా హైదరాబాద్ లో కూడా ఒకటి నడిచింది.
అయితే.. ఇక్కడ మోసపోయిన యువకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ముఠా వ్యవహారం మొత్తం గుట్టు రట్ట య్యింది. ఈ ఘటన కి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి …ప్రతి రోజు హైదరాబాద్ నగరానికి వేల సంఖ్యలో యువత చదువు కోసం లేదా పని చేసి డబ్బు సంపాదనకు వస్తుంటారు.అయితే ఈ క్రమంలో కొందరు ముఠా సభ్యులు వారికి కాల్ బాయ్ ఉద్యోగాలు తమ దగ్గర ఉన్నాయంటూ కొన్ని వెబ్సైట్లలో ప్రకటనలు, సెల్ ఫోన్లకు మెసేజ్ లు పంపించారు. ఇందులో భాగంగా తమదగ్గరవివాహ బంధం లో నిరుత్సాహ పడినటువంటి ఆంటీలు మరియు అమ్మాయిలు అన్ని వయసుల వారు తమ దగ్గర ఉన్నారంటూ ఈ ప్రకటనలో వివరాలు పెడుతున్నారు.
అంతేగాక వాళ్ళని సుఖపె డితే రోజుకు రూ.వేలల్లో నుంచి రూ.లక్షల దాకా సంపాదించుకోవచ్చు అంటూ ఆశ చూపుతున్నారు.అయితే ఇందుకుగాను అభ్యర్థులు చేయాల్సిందల్లా వారికి రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ చేసి వారు చేయబోయే ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉండమని చెబుతారు.ఇలా ప్రస్తుతం నగరంలో కొంతమంది డబ్బు ఆశపెట్టి యువత దగ్గర డబ్బు కొట్టేస్తున్నారు.
అయితే తాజాగా ఓ యువకుడు కూడా ఇదేవిధం గా మోసానికి గురై హైదరాబాద్ లోని ఓ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేసాడు .దీంతో పోలీసులు ఇలాంటి తరహా ప్రకటనల పై నిఘా ఉంచారు. సైబర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి విషయం లో జాగ్రత్తగా ఉండవలిసిన పరిస్థితులు మనచుట్టూ ఉన్నాయి .. ఇలాంటి ఫోన్స్ ,మెసేజెస్ వచ్చినప్పుడు అప్రమత్తం గా ఉండాలి … ఒకటికి పదిసార్లు అన్ని విధాలా ఆలోచించాలి .. ఎవ్వరైన పెద్దమొత్తం లో డబ్బు చెల్లించడానికి ఎందుకు సిద్ధం గా ఉంటారు??అలోచించి అడుగు వేయండి .