నేటి తరం లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ప్రపంచ మంటూ సోషల్ మీడియా లోనే తిరుగుతున్నారు. ఎప్పటిప్పుడు జరుగుతున్నా సంఘటనలు చెప్తూ సెల్ఫీలు పెడుతున్నారు . ఇంకా చెప్పాలంటే బిర్యానీ తిన్నాను ,ఇవి కొనుక్కున్నాను, ఆ ప్రాంతాని కి వెళ్ళాను అంటూ ప్రతి వీడియోలుతీసి సోషల్ మీడియాలో పెడుతూ నెట్టింట్లో నే ఎక్కువ ఉండేందుకు ప్రత్నిస్తూఉంటారు..
అయితే, ఇది కొంత వరకూ పర్లేదనిపించినా.. ఈ విషయం లో తమని ఇతరుల తో పోల్చుకుంటూ వారిలా మనం కూడా ఉంటే బావుండని మనం ఏమి చేయలేకపోతున్నాం, వాళ్ళ లాగ మనం తిరగలేక పోతున్నాముఅనే ఆలోచనలతో క్రుంగిపోవడం కారణం గా జబ్బులు త్వరగా వస్తున్నాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
సోషల్ మీడియా లో యాక్టివ్గా ఉన్న కొంతమంది టీనేజర్లపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఈ అలవాటు రాను రాను వ్యసనం గా మారుతుందని తెలిపారు.. తాము పెట్టిన పోస్టుల కు కామెంట్స్ రాకుంటే ఎందుకు రాలేదా అని ఆలోచిస్తూ చివరికీ కుంగుబాటుకు గురిఅవుతున్నాట్టు తేలింది చివరికీ. ఇది ఒక మానసిక వ్యాధిగా మారుతుందని… అలాంటి సమస్యను వెంటనే గుర్తించి దాన్నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాకారణం గా నిద్ర లేమి,మతిమరుపు,ఒత్తిడి,కృంగు బాటు లాంటి ఎన్నో వ్యాధులు మనల్ని విడకపోవడం వలన జీవితం లో ఎంతో విలువయిన వాటిని కూడా కోల్పోతున్నాం కాబట్టి, ఎవరికీ వారు ప్రయత్న పూర్వకం గా సోషల్ మీడియా మాయ నుంచి బయటపడి సమాజం లో బ్రతికే వ్యక్తులుగా మంచి ఆలోచనలతో జీవితాన్ని దిద్దు కోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు .