Mineral Water: శరీరానికి నీరు ఎంతో అవసరం.. ఆహారం లేకుండా కేవలం నీటి తో ఎన్నో రోజులు జీవించగలం.. ఎలాంటి నీరు తాగాలి.. స్వచ్ఛత ఏమౌతుంది అనే విషయాల్లో ఎవరికీ క్లారిటీ లేదు.. ఆర్.ఓ రివర్స్ ఆస్మోసిస్ నీళ్లకోసం.. అదే మినరల్ వాటర్ కోసం ఈ రోజుల్లో ఎంతో ఖర్చు చేసి మరీ కొని పిల్లల నుంచి పెద్దల వరకు తాగుతున్నారు..
మినరల్ వాటర్ తాగుతున్నాను కదా మేము ఆరోగ్యంగానే ఉంటున్నామని భ్రమలో బ్రతికేస్తున్నారు చాలామంది అయితే మినరల్ వాటర్ తయారు చేయడానికి ముందు ఆరో విధానంలో మలినాలను తొలగించే క్రమంలో అవసరమైన మినరల్స్ పోతున్నాయి.. మినరల్స్ తొలగించిన నీటిని మనం మినరల్ వాటర్ అని భ్రమపడుతున్నాం.. వాస్తవానికి మినరల్ వాటర్ తాగితే ఆరోగ్యానికి లాభమా..!? నష్టమా..!? ప్రతిరోజు మూడు లేదా ఐదు లీటర్ల మినరల్ వాటర్ తాగితే శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Mineral Water: మినరల్ వాటర్ తాగుతూనే ఇలా చేయండి..!!
మినరల్ వాటర్ పేరుతో నీటిలోని అసలైన ఖనిజాలను దూరం చేస్తున్నారు.. ప్యూరిఫికేషన్ పేరుతో విలువైన పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలను తొలగిస్తున్నారు. దీంతో ఇవి శరీరానికి అందకుండా పోతున్నాయి.. ఖనిజాల కొరత ఏర్పడి శరీరం వీక్ అవుతుంది.. మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే ఎముకలు పెరిగిపోతున్నాయి.. అలా అని ఇప్పటికీప్పుడూ మినరల్ వాటర్ తాగడం మానేయమంటారా అని సందేహ పడుతున్నారా..!? మినరల్ వాటర్ తాగుతూ కొన్ని ఎక్కడ ఆహార పదార్థాలను తీసుకుంటే మినరల్ వాటర్ తాగినా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.. మినరల్ వాటర్ తాగుతూనే శరీరానికి కావలసిన మినరల్స్ ను అందించాలి. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మినరల్ వాటర్ ప్యూర్ ఫికేషన్ లో మినరల్స్ అన్ని పోతాయి. కాబట్టి అందులో లేని ఖనిజాలు, లవణాలను శరీరానికి అందిస్తే ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి వ్యాధులు మీ దరి చేరవు..
శరీరానికి కావలసిన పూర్తి లవణాలు దొరకాలి అంటే మనం రోజులో కనీసం ఒక కొబ్బరి బొండం నీళ్ళు తాగాలి. కొబ్బరి నీళ్లలో శరీరానికి కావలసిన లవణాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఆకుకూరల్లో కూడా లవణాల శాతం అధికంగా ఉంటుంది. రోజులో ఏదో ఒక రూపంలో ఆహారంలో ఆకుకూరలను భాగం చేసుకోవాలి. దీనివలన శరీరానికి కావలసిన లవణాలను పొందవచ్చు. అలాగే ఈ రోజు ఏదో ఒక పండ్ల రసం తాగాలి. ఇంకా కూరగాయల రసం తీసుకోవటం వలన లవణాల లోపాన్ని అధిగమించవచ్చు. బీరకాయ, సొరకాయ, దోసకాయ, కీర దోసకాయ, టమాటాలు నీటితో నిండిన కూరగాయలలో లవణాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి నేరుగా మినరల్స్ అందుతాయి. శరీరానికి కావలసిన లవణాలు కోసం పూర్తిగా మినరల్ వాటర్ ఆధారపడకుండా ఆహారంలో ఇవి కూడా ఉండేటట్లు జాగ్రత్త పడటం వలన శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు. ప్రతిరోజు మినరల్ వాటర్ తాగుతూనే కొబ్బరి బొండం నీళ్ళు, ఆకుకూరలు, కూరగాయల జ్యూస్, పండ్ల రసాన్ని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.