ముంబై: కరోనా కలకలం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. దీని మూలంగా మనుషుల మధ్య అంటరానితనం కూడా వచ్చేసింది. ముందెన్నడూ లేని సోషల్ డిస్టెన్స్ ను కూడా మనకు పరిచయం చేసేసింది. కరోనా వచ్చి చనిపోయిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా పాజిటీవ్ అని తెలిస్తే చాలు ఇంట్లోకి కూడా రానివ్వకుండా చేస్తున్నారు. మరి కొంత మంది మరీ దారుణం.. కరోనా వచ్చిన చనిపోయిన వారిని కనీసం చూడటానికి కూడా అఇష్టం చూపెడుతున్నారు. వీరి చావు కుక్క చావేనని చెప్పడంలో ఎలాంటి సందే హం లేదు. కరోనా భారిన పడి చనిపోయిన వారిని జేసీబీలతో గుంత తీసి దానితోనే అందులో పడేస్తున్న ఘటనలు మనం చూసినవే.. ఇదిలా ఉండగా కరోనా పాజిటీవ్ పేరుతో హాస్పటల్లో చికిత్స చేసుకునే వారు అక్కడ ఎలా ఉంటున్నారో ఎందరికి తెలుసు..
కరోనా వైరస్ భారిన పడి ఓ యువకుడు ఓ హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. కాగా అతను టాయిలెట్ లో కుప్పకూలి మరణించాడు. ఇదిలా ఉంటే ఈ ఘటన 14 రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. మరి ఆ విషయం హాస్పటల్ సిబ్బందికి కూడా తెలియదట.. మరి దీన్ని ఏమంటారు.. దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలోని శివాడి ప్రాంతంలో ఉన్న టీబీ ఆస్పత్రిలో ఈ ఘటన వెలుగుచూసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆస్పత్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
హాస్పటల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యబన్ యాదవ్(27) టీబీ వ్యాధి కారణంగా కొన్ని రోజుల కిందట హాస్పటల్ లో చేరాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా అందులో పాజిటీవ్ అని తేలింది. దాంతో అతను దానికి చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల కిందట అతడు హాస్పటల్ లో కనిపించకుండా పోయాడు. దీంతో హాస్పటల్ సిబ్బంది సిబ్బంది వెతికినా ఫలితం లేకపోవడంతో అక్టోబర్ 4 న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాని సూర్యబన్ యాదవ్ అధృష్యమైన 14 రోజుల తరువాత హాస్పటల్ టాయిలెట్ లో శవమై కనిపించాడు. ఆ హాస్పటల్ లో పనిచేసే ఓ వార్డ్ బాయ్.. సదరు టాయిలెట్ గది నుంచి దుర్వాసన రావడంతో ఆ శవాన్ని గుర్తించాడు. అప్పటికే ఆ వ్యక్తి శరీరం కుళ్లిపోయి ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణకు సహకరించాలంటూ హాస్పటల్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. రాక్ మర్గ్ పోలీస్ స్టేషన్ లో ఈఘటనపై కేసు నమోదైంది. 14 రోజులుగా మృత దేహాన్ని గుర్తించకుండా ఎలా ఉంటారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెళ్లడించారు.
ఇదిలా ఉంటే అసలు హాస్పటల్ సిబ్బంది కరోనా పేషెంట్లను పట్టించుకునే పరిస్థితిలో ఉందా అనేది అనుమానం కలిగిస్తోంది ఘటన. 14 రోజులుగా అసలు ఆ టాయిలెట్ ను శుభ్రం చేయకుండా ఎలా ఉంటారు. పైగా రోగుల గురించి కనిపించడం లేదంటూ చేతులు దులుపుకుంటే ఏంటర్థం. ఈ ఘటనతో ప్రజలు హాస్పటల్లకు నమ్మకంగా వెలతారా? ఆలోచించాలి?