వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం యొక్క సున్నితత్వం తగ్గిపోతూ ఉంటుంది. నిగారింపు, మెరుపూ, బిగుతూ తగ్గి నిర్జీవం గా తయారవుతుంది. అయితే పెరుగుతున్న వయసు తో పాటు చర్మం నిగారింపు కోల్పోకుండా, యవ్వనంగా ఉండాలంటే..ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పోషక ఆహారం తో పాటు తగినంత నీరు, వ్యాయామం ఎప్పుడు యవ్వనం గా కనిపించే విధం గా చేయడం లో ముఖ్య పాత్ర వహిస్తాయి అన్నవిషయని మరిచిపోకూడదు.
చాలామంది బాగా వేడి నీటి తో స్నానం చేయడం ఇష్టం. అయితే ఇది చర్మానికి అస్సలు మంచిది కాదంటున్నారు చర్మ నిపుణులు.స్నానం చేసే నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండాలి. మరీ వేడిగా నూ, మరీ చల్లగా నూ లేకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది. గాఢమైన వాసన వచ్చే సుగంధబరితమైన సబ్బులు కూడా వాడకూడదు.
సబ్బు మైల్డ్ గా ఉంటే అది శరీర నిగారింపు ను కాపాడుతుంది. మాయిశ్చరైజేషన్ లోషన్స్తో చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. పొగతాగే అలవాటుంటే వెంటనే మానుకోవాలి . పొగ లోని రసాయనాలు వృధాప్య ప్రక్రియను మరింత త్వరగా జరిగేలా చేయడం వలన వృద్ధాప్యంలో వచ్చే మార్పులన్నీ త్వరగా వచ్చేస్తాయి.
ఎండలో కి వెళ్లేప్పుడు తప్పకుండా మంచి సస్స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. శరీర తత్వానికి సరిపోయే సన్స్క్రీన్ డాక్టర్ సలహా తీసుకుని వాడడం మంచిది. ఎండకు, చలికి, వర్షానికి చర్మం పాడవకుండా సౌకర్యవంతంగా ఉండడానికి శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే దుస్తులు వేసుకోవాలి. ఆహారంలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే లా చూసుకోవాలి.
ఆకు కూరలు, పండ్లు,బాదం వంటి డ్రై ఫ్రూట్స్లో ఈ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం తో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా జాగ్రత్త పడాలి. దీనివల్ల హైడ్రేటెడ్గా ఉంటారు. దాని ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మెరుపు తో నిగారిస్తూ ఉంటుంది. థైరాయిడ్, డయాబెటిస్, పోషకాహార లోపాలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారి లో చర్మం పొడిబారిపోయి మరికొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా పాటించడం మంచిది.