Diabetes: డయాబెటిస్ సైలెంట్ కిల్లర్.. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు.. చాపకింద నీరులా రోజురోజుకీ విస్తరిస్తోంది..! ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం సంవత్సరానికి 16 లక్షల మంది డయాబెటిస్ వల్ల చనిపోతున్నారు.. దీని ఆన్ చూడటానికి వేప ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.. వేపాకుల జ్యూస్ ఇలా తయారు చేసుకొని తాగితే మధుమేహంకు చెక్ పెట్టవచ్చు..!
ముందుగా గుప్పెడు వేపాకులు తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని ఎండ తగలకుండా నీడగా ఉన్న ప్రదేశంలో ఎండబెట్టుకోవాలి. నాలుగు రోజులపాటు ఇలా చేస్తే వేపాకులు ఎండిపోతాయి. ఇలా చేయటం వలన వేపాకుల లో ఉండే ఔషధ గుణాలు వాటిల్లోనే ఉంటాయి. అదే ఎండలో ఎండ పెడితే వాటిలో ఉన్న గుణాలు కోల్పోతాయి. ఇలా ఎండబెట్టుకున్న ఆకులను మిక్సి పట్టి పొడి చేసుకోవాలి. ఈ వేపాకుల పొడిని నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వేపాకులు పొడి వేసి బాగా కలపాలి. ఈ నీటిని ఉదయం పరగడుపున తాగాలి. ఇలా ఒక వారం రోజులపాటు చేస్తే డయాబెటిక్ లెవెల్స్ క్రమంగా తగ్గడం మీరే గమనిస్తారు.
వేపాకుల పొడి కలిపిన నీటిని తాగితే డయాబెటిస్ తగ్గించడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. జీర్ణాశయాన్ని క్లీన్ చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన హానికర బ్యాక్టీరియాను బయటకు నెట్టి వేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.