మన వంటింట్లో వుండే పదార్ధాలు వల్ల మనకు ఎన్నో లాభాలు, ప్రయోజనాలు వున్నాయి.చిన్ని చిట్కాలు పాటించడం వలన శరీర శక్తి పెరుగుతుంది. రెండు పూటలా పచ్చి ఉల్లి పాయతో మజ్జిగన్నంతింటే అస్సలు రోగాలు అనేవి రావు . అలాగే పెరుగన్నం తినేటప్పుడు ఉల్లిపాయ నంజుకుని తింటే పిల్లలు చాలా పుష్టిగా ఉంటారు.
వంటలలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పుడు ఎముకల బలం తగ్గడం అనేదే ఉండదు . ఇందులో ఉండే ఐరన్ వలన ఎముకలు చాలా దృడంగామారతాయి .ఇంకా వెల్లులితో ఎన్నోప్రయోజనాలు ఉండడం వలన ఆహారంలో వెల్లులి ని క్రమమం తప్పకుండ తీసుకోవాలి .
రోజుకి రెండు పూటలా ధనియాల నుకషాయం రూపం లో తాగుతుంటే మూత్రంతో పాటు వీర్యం పోయే సమస్య తగ్గుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
కరక్కాయను సిరా తో నూరి పట్టిస్తే దీర్ఘ కాలిక తామర మూడు రోజుల్లో మాయం అవుతుంది.
రోజుకో కప్పు యాలకుల టీ తాగితే హృదయారోగ్యానికి మంచిది. తలనొప్పిగా ఉన్నప్పుడు యాలకులు లేదా యాలకుల పొడి టీ లో వేసుకుని తాగితే మెదడుకు ప్రాణవాయు సరఫరా పెరిగి తలనొప్పి వెంటనే మాయమవుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది.
వాము నిప్పుల పై వేసి వచ్చే పొగ మాటి మాటి కి పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది.
ఆహారానికి అరగంట ముందు కప్పు వేడి నీరు తాగితే రక్త శుద్ధి జరుగుతుంది.
జీలకర్ర ఏ విధం గా వాడిన బరువు తగ్గుతుందని, కొవ్వు చేరకుండా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మన వంట ఇంటిలో ఉండే ఈ పధార్ధాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి . అనేక సమస్యలు నుంచి విముక్తి పొందండి. సంపూర్ణ ఆరోగ్యంగాజీవించండి .