శాస్త్ర పరిజానం ఎన్ని కొంత పుంతలు తొక్కుతున్న మానవాళికి ఇంకా అంతుచిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికి ఎన్నో ఔషధాలు అందుబాటులోకి వచ్చిన నేటి వైద్య శాస్త్రాన్ని సవాలు చేస్తూ కొత్త కొత్త వైరస్లు, బ్యాక్టిరియాలు పుట్టుకొచ్చి అనేక రకాల ప్రాణాంతక వ్యాధులను కలుగుజేస్తూ మనవ మనుగడను ప్రశ్నిస్తున్నాయి. గతేడాది చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఇప్పటికే యావత్ ప్రపంచం గజగజ వణికిపోతున్నది. దాదాపు 38,746,500 మందికి సోకిన కరోనా వైరస్ అనేక అనారోగ్య సమస్యలను కారణమైంది. దీనికి తోడు అన్ని దేశాల్లో కలిపి సుమారు 10,96,881 మందిని ఈ కరోనా మహమ్మారి బలి తీసుకున్నది అంటే ఎంతో ప్రమాదకరమైన వైరస్ అనేది ఇట్టే అర్థమవుతున్నది.
అయితే, తాజాగా మానవాళికి మరో వైరస్ ముప్పు పొంచి ఉన్నదని పరిశోధకులు వెల్లడించారు. పందులలో స్వైన్ అక్యూట్ డయేరియా సిండ్రోమ్ ను కలుగజేసే కరోనా జాతికి చేందిన ఓ రకమైన వైరస్… పందుల నుంచి మానుషులకు వ్యాప్తి చెందుతుందని అమెరికాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ మనుషుల ప్రాణాలను హరిస్తున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికాకు చెందిన యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఏడు రకాలైన ఆల్పా, బీటా కరోనా వైరస్ జాతుల జాబితాను సిద్ధం చేసి వాటిపై పరిశోధనలు కోనసాగిస్తున్నది.
వీటిలో సాడ్స్–కోవ్ కరోనా జాతి వైరస్లతో పాటు పలు రకాలకు చెందిన వైరస్లు మానుషులకు వ్యాపిస్తాయని సీడీసీ గుర్తించింది. అలాగే, జంతువులకు మాత్రమే సోకే మరిన్ని రకాల వైరస్ జాతులను గుర్తించారు. ఇవి పలు మార్పులకు లోనై జంతువుల ద్వారా మనుషులకు సోకే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించడం ఆందోళన కలిగిస్తున్నది.ముఖ్యంగా సాడ్స్–కోవ్ వైరస్ రకం పందులకు కలిగే ప్రమాదకరమైన రోగమైన స్వైన్ అక్యూట్ డయేరియా సిండ్రోమ్ను కలుగజేస్తుంది.