వేడి నీళ్ళు: ఉదయం లేవగానే పరగడుపున చాలా మంది టీ, కాఫీ తాగడం అలవాటు.. మరి కొంతమంది వేడి నీళ్లు తాగుతారు.. కానీ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా నెయ్యి కలుపుకొని తాగితే.. మీరు ఊహించని ఫలితాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యిని ఒక గ్లాసు వేడి నీటిలో వేసి కలిపి ఆ నీటిని తాగాలి.. ఈ నీళ్లు తాగిన అరగంట వరకు ఏమీ తినకూడదు.. ఇలా ప్రతిరోజు ప్రతిరోజు చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అథరైటిస్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది నెయ్యి సహజ సిద్ధమైన పని చేస్తుంది. పరగడుపున నెయ్యిని తీసుకుంటే బ్రెయిన్ సెల్స్ ని మరింత యాక్టివ్ గా చేస్తుంది దాంతో జ్ఞాపకశక్తి నీ పెంపొందిస్తుంది నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది కాగ్నిటివ్ ఫంక్షన్ ను మెరుగు పరుస్తుంది ఆ విధంగా అల్జీమర్స్ మతిమరుపు బారిన పడే ప్రమాదాన్ని అరికట్టవచ్చు ప్రతిరోజు ఒక చెంచా నెయ్యిని తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు.. ఈ నీటిని తాగడం వల్ల చర్మానికి అవసరమైనా తేమను అందించి పొడి చర్మం సమస్య నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. సోరియాసిస్ ఉంటే చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది..
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాలలో ఒక చెంచా నెయ్యిని కలుపుకుని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.. తరచుగా ఆవు నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది..