అమ్మ అవ్వడం అనేది ఒక గొప్ప వరం.కడుపుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. లేదంటే తల్లితో పాటు బిడ్డకి కూడా ప్రమాదమే.కడుపుతో ఉన్న మహిళకు చాలా రకాల కోరికలు ఉంటాయి.ఏవేవో తినాలని అనిపిస్తుంది. రకరకాల పిండి వంటలు తినాలపించడం సహజమేనని, గర్భవతుల ఏం తినాలని కోరుకుంటే అవి చేసి పెట్టాలని చెబుతూ ఉంటారు.కడుపుతో ఉన్న సమయంలో తినే ఆహారం తల్లినీ, బిడ్డనీ కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా పంచదార ఎక్కువ ఉన్న పదార్ధాలు వీలైనంత తగ్గించమని వారు సలహా ఇస్తున్నారు.
పంచదార తీసుకునే విషయంలో ప్రెగ్నెన్సీ టైమ్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తల్లి, బిడ్డ కొన్ని రకాల సమస్యలని ఎదురుకోవాల్సి ఉంటుంది.షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల తల్లీ, బిడ్డా కూడా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి రావచ్చు. పిల్లలు పుట్టే సమయానికే ఎక్కువ బరువు ఉండొచ్చు, పుట్టాక బరువు పెరగొచ్చు. పిల్లలకే కాక తల్లికి కూడా ఇది సమస్యనే. మామూలు గర్భం తో ఉన్నప్పుడు పెరిగిన బరువు కన్నా పంచదార ఎక్కువగాతీసుకోవడం వలనపెరిగిన బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది.
తల్లులు కడుపుతో ఉన్న టైమ్లో స్వీట్స్ ఎక్కువగా తింటే పిల్లలకి చిన్నప్పుడే గుండెకి సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తియ్యగా ఏమైనా తినాలనిపిస్తే పండ్లు తినడం మంచిది. పంచదార కలపకుండా పండ్ల రసం తీసుకోవచ్చు. లేదా బెల్లంతో చేసిన పదార్ధాలు కూడా తినవచ్చు. మరీ ఐస్ క్రీమ్, చాక్లెట్టో తినాలనిపిస్తే తినండి, కానీ, కొంచెం తినండి. కడుపుతో ఉన్నప్పుడు తల్లి పంచదార ఎక్కువ ఉన్న పదార్ధాలు తింటే ఆ పిల్లల పుట్టిన తర్వాత కొద్దిగా చురుకుదనం లోపంతో ఉంటారు…కాబట్టి తల్లి కాబోయే వారు ఈ విషయాలని తప్పక గుర్తు పెట్టుకోవాలి.