Over Eating: భోజనం చేసేటప్పుడు మనకు నచ్చిన ఆహార పదార్థాలు ఉంటే ఈ రోజుటి కంటే ఎక్కువ తింటాము.. ఇలా ఫుల్ గా లాగించేశాక తిన్నది జీర్ణం కాక అవస్థలు పడుతూ ఉంటాము.. ఆహారం తీసుకోవడం తప్పు కాదుకానీ.. అది అరగకపోతే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని గుర్తుంచుకోవాలి. కడుపునిండా తిన్న తర్వాత ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి చాలు.. ఇంకా ఎలాంటి సమస్యలు రావు..
మనలో అందరం చేసే తప్పు ఏమిటంటే భోజనం చేసిన తర్వాత వెంటనే కూర్చోవటం. తిన్న తర్వాత ఒకే చోట ఎక్కువసేపు కూర్చోకూడదు. మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. ఇది మీ శరీరాన్ని సక్రియం చేస్తుంది. ఇలా లేచి నడవడం వలన త్వరగా క్యాలరీస్ బర్న్ అవుతాయి. దాంతో త్వరగా తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది. కడుపునిండా తిన్న తర్వాత నల్ల ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలిపిన నీటిని ఒక అరగంట తర్వాత తాగాలి. దీని వలన కడుపు ఉబ్బరం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
Read More: Face Pack: 5 రూపాయలకే పార్లర్ లాంటి ఫేషియల్ గ్లో..
మీకు ఎప్పుడైనా కడుపుని ఉండాయి అనిపించగానే వెంటనే చిన్న దోసకాయ ముక్కను తినండి. ఆహారం తిన్న ఇరవై నిమిషాల తర్వాత దోసకాయ తింటే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇష్టమైన ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే వెంటనే గోరువెచ్చటి నీళ్లు తాగండి. ఇలా చేయడం వలన గ్యాస్, అసిడిటీ, అజీర్తి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. వేడి నీటిలో కావాలంటే నిమ్మరసం, కొద్దిగా ఉప్పు కలుపుకొని ఫాస్ట్ గా రిలీఫ్ అందుతుంది. భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పాటు నడిస్తే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇలా చేయటం వలన అరగంటలో 200 కేలరీలు బర్న్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఫుల్ గా లాగించేమని ఇబ్బంది పడకండి. కడుపునిండా తిన్న తర్వాత విషయాలు గుర్తుంచుకోనీ ఇలా ట్రై చేయండి.