నేడు ఎంతోమంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 200 కోట్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఇచ్చిన నివేదిక తెలియచేస్తుంది . పేద దేశాల్లో దాదాపు 40 శాతం మంది పసి పిల్లలు,50 శాతం మంది గర్భిణీలు, ఈ సమస్య ను ఎదురుకుంటున్నారు. రక్తహీనతకు కారణాల గురించి ఆలోచిస్తే అనేకఅంశాలు ఉంటాయి. ఉప్పు, పులుపు, అధికంగా తీసుకోవడం, మధ్యాహ్నం నిద్ర లేదా అతి నిద్ర, అజీర్ణం, మలబద్దకం, స్త్రీలకు రుతు సమస్యలు వంటి అనేక కారణాల వల్ల రక్త హీనత రావొచ్చు.
కళ్లుతిరగటం, కంటి చుట్టూ నల్లటి వలయాలు,కళ్ళు పాలిపోయినట్లు ఉండటం, చూపు మందగించడం, తల తిరుగుతున్నట్లు ఉండటం, తలనొప్పి, చీటికీ మాటికి జలుబు, గుండె పెరగడం, గుండెదడ, గుండె వేగంగా కొట్టుకోవడం, త్వరగా అలసిపోవడం, కొంచెం దూరం నడిచే సరికి ఆయాసం, శ్రమఏమి పడక పోయిన నీరసం రావడం, బలహీనత, తీవ్రమైన అలసట,ఏ పని చేయాలన్న శరీరం సహకరించదు, ఒళ్లంతా నీరు చేరడం, కాళ్లు చేతులు తిమ్మిర్లు, ముఖం, చర్మం పాలిపోవడం, శరీరం లో విపరీతం గా నీటి శాతం పెరిగిపోవడం,నాలుక, పెదాలు పాలిపోయి, చేతి వేళ్లు, తెల్లగా కనిపించడం, నాలుకపై తెల్లని మచ్చలు, చిగుళ్లువాపు, తరచూ ఇన్ఫక్షన్ లు రావడం మొదలైన లక్షణాలు ఉంటాయి.
ఈ లక్షణాలు కనబడినప్పుడు వీలైనంత త్వరగా డాక్టరును సంప్రదించి సలహాలు సూచనలు తీసుకుంటూ తగిన చికిత్స తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు నిత్యం ఆహారం లో ఉప్పు ను తగ్గించుకుని తినడంచాల మంచిది. రక్త హీనత సమస్య కు మన ఇంట్లో ఉండే సహజ పదార్థా లే ఔషధా లు గా కూడా పని చేస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారం లో రోజూ ఏదో ఒక విధంగా తేనెను తీసుకోవాలి. ఇందులో ఉండే ఐరన్ శరీరం లో రక్తా న్ని తయారు చేస్తుంది.యాపిల్ పండు రసం తీసుకుని అదే మోతాదు లోఒక కప్పు బీట్రూట్ రసం, రెండింటి నీ కలిపి తాగాలి. రోజూ ఈ రసం తీసుకుంటే త్వరలో నే రక్త హీనత తగ్గుముఖం పడుతుంది. రెండు టీ స్పూన్ల తేనెతో బాగా పండిన అరటి పండును కలిపి తినాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే రక్త హీనత తగ్గుతుంది.
యాపిల్ ,టమాటా, పండ్ల రసాలను కలిపి రోజూ తీసుకున్న రక్తహీనతను తగ్గించుకోవచ్చు. మనం రోజూ తీసుకు నే ఆహారం లో బెల్లంతో తయారుచేసిన వేరు శెనగ ఉండలు, రాగులు, బెల్లం, రాగి ముద్ద, సజ్జలు, యాపిల్, నల్లద్రాక్ష పళ్లు,బాదం, సపోటా, మామిడి, ఫిగ్, ఖర్జూరం, సీతాఫలం, చెర్రి స్రాటబెర్రీ, రాస్పబెర్రీ, కిస్మిస్, బీట్రూట్, బీన్స్,బొప్పాయి, పుచ్చకాయ, దంపుడు బియ్యం,దంపుడు అటుకులు, నల్లనువ్వుల నూనె, పాలు, బ్రెడ్, తేనె, మొలకెత్తి న పెసలు, శెనగలు, ఆప్రికాట్, ఈతపండ్లు, రాజ్మా, మటన్, కిడ్నీ, చికెన్, కార్జం నత్తలు,మునగాకు, కొన్ని రకాల చేపలు, ఉల్లికాడలు, తోటకూర, తాజా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి గోధుమ గడ్డిరసం లేక గోధుమగడ్డి పౌడరు. వీటితోపాటు సి విటమిన్ ఉండే నిమ్మ ఉసిరి, బత్తాయి, నారింజ తీసుకుంటే శరీరమునకు కావలిసిన ఇనుము అందుతుంది.
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.