చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య స్థూలకాయం, రోజాంత ఉద్యోగంలో ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం కూడా ఊబకాయం రావడానికి కారణమవుతుంది.
దీనికి ప్రధాన కారణం శరీరంలో కొవ్వు పేరుకుపోవడం. దీనివల్ల గుండె సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు వస్తున్నాయి.ఆరోగ్యకరమైన జీవితం కోసం తీసుకోవాల్సిన ఆహారం అంటే ఏం తీసుకోవాలో అన్న అనుమానం మనందరికీ ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం ఒక్కటే సరిపోదు, ఆరోగ్యకరమైన సమయం లో తీసుకోవాలి అన్న విషయం గుర్తు పెట్టుకోండి.
భోజనం చేసినా మళ్లీ చిరుతిళ్లవంటివి తింటారు. అలా చెయ్యకూడదు. కావాలంటే భోజనం కొద్ది కొద్దిగా రెండుసార్లు తినడం మంచిది. ప్రతీ రెండు గంటలకు ఓసారి ఎంతో కొంత ఏదో ఒకటి తినాలి. అయితే భోజనం వంటివి మరీ ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలి. కేకులు, చాకొలెట్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ చాలా రుచిగా ఉంటాయి.
కానీ వీటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అది మన గుండెకు ప్రమాదకరం. ఇవి ఎక్కువగా తింటే మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. అవి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరల్లో గడ్డలుగా గూడుకడతాయి. ఏదో ఒక రోజు అదే కొవ్వు రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అంతే హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. అందువల్ల డేంజర్ ఫుడ్కి దూరంగా ఉండాలి. అప్పుడప్పుడూ తింటే పర్లేదు గానీ రోజూ అలాంటివి తింటే గుండెకు ఇబ్బందిగా ఉంటుంది.
మాంసం, చికెన్, చేపలు, గుడ్ల వంటివి ప్రోటీన్స్ (మాంసకృత్తులు) ఎక్కువగా ఉండే ఆహారాలు. అయితే ఈ ఫుడ్లో కూడా బీఫ్ అయితే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దానికి బదులుగా చికెన్, మటన్ వంటివి తినడం ఉత్తమం. చేపలు మంచివి. వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి కొవ్వును తగ్గిస్తాయి. గింజలు, బఠాణీలు, వేరుశనగ వంటివి కూడా కొద్ది మొత్తాల్లో తీసుకుంటే చాలా మేలు.
వరి, గోధుమలతోపాటూ రాగులు, జొన్నలు, సజ్జల వంటివి ఈమధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి అవి అన్నీ తినాలి కూడా. ఇక వాటిలోనూ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వచ్చేసింది. అది రేటు ఎక్కువైనా మన శరీరానికి చాలా మంచిది . ఇలా మనం తినే వాటిలో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండేలా చేసుకోవాలి. మనం తినే ఆహారాల్లో మృతం, అమృతం అని రెండు రకాలుంటాయి.
డీప్ ఫ్రై చేసే ఆహారం మృత ఆహారం. అది తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అదే ఆకు కూరలు, కూరగాయలు, కాయలు, పండ్ల వంటివి మృతం కానీ అమృత ఆహారం. అవి ఎంత తింటే అంత మన శరీరానికి మేలు జరుగుతుంది. అమృతాహారంలో పోషకాలు ఎక్కువ, కొవ్వు తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి తింటే గుండెకు ఎంతో మేలు కలుగుతుంది.కూరగాయలూ, పండ్లలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. పండ్లూ కూరగాయలూ ఎక్కువ తీసుకోవడం వల్ల మీట్, చీజ్, ప్రాసెస్డ్ స్నాక్స్ వంటివి తీసుకునే ఛాన్స్ తగ్గుతుంది.