పెళ్లి అనేది జీవితంలో ఒకే ఒక్క సారి వచ్చే పండుగ. విభిన్న పద్దతుల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసిచేయబోయే ప్రయాణం . పెళ్లయిన తొలిరోజుల్లో భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయిస్తూ హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే కొన్ని రోజులకు ఈ దగ్గరితనం కాస్త దూరమైపోతుంది. పిల్లలు పుట్టే సరికి ఆ ప్రేమంతా అటువెళ్లిపోతుంది . అది తప్పుకాదు కానీ ముందు మీరు ఒకరికి ఒకరు ఆ తర్వాతే పిల్లలు అని మాత్రం మరచిపోవద్దు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు . మీ భాగస్వామి మీకు ఎంత ముఖ్యమో మీరు వారిని ఎంత పేమిస్తున్నారో ఎప్పటికి అప్పుడు వారికి తెలియజేయాలి. నిజానికి చాలామంది వారి ఫీలింగ్స వారిలోనే దాచుకుంటారు. అలా కాకుండా వాటిని ఎక్స్ ప్రెస్ చేస్తే మీ జీవిత భాగస్వామితో ఎలాంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు..
విషయాలను మాటల్లో చెప్పలేనిది కౌగిలింతలతో, ముద్దులతో , స్పర్శ తో వారికి అర్థమయ్యేలా చెప్పవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి వీలైనప్పుడల్లా మీ పార్టనర్ కి హాగ్ లేదా స్పర్శ ఇవ్వడానికి ప్రయతించండి. అంతేకాకుండా వారు చేసే పనులలో ఏదైనా మీకు నచ్చితే వారికి కాంప్లిమెంట్ ఇవ్వడం ద్వారా మీ భాగస్వామికి ఆనందాన్నిఇవ్వవచ్చు . వీటితో పాటు మీ పార్టనర్ తో ఎప్పుడూ నిజాయితీగా ఉండేవిధంగా ప్రయత్నించండి. నిజాయితీ మీదే మీ కుటుంబాలు నిలబడతాయి అన్న విషయాన్ని గ్రహించాలి. దాంపత్య జీవన ప్రయాణానికి భర్త, భార్య ఇద్దరు సారధులే. ఇద్దరూ సమానులే.
సర్దుబాటే ఆనందమయ దాంపత్య జీవిత రహస్యం అని మరువకండి . దంపతులు శారీరకంగా దగ్గరవటానికి ముందు మానసికంగా దగ్గర అవ్వాలి . పురుషుడి కి ఆమె తప్ప ఆమె కుటుంబం వద్దు, ఆమెకి అతను తప్ప అతని కుటుంబం వద్దు. ఈ ధోరణి చాలా ప్రమాదకరం. ఆ కుటుంబాలు లేకుండా తాము లేమని గ్రహించుకోవాలి. ఇరువైపుల కుటుంబాల్ని కూడా ఇద్దరూ ప్రేమగా అల్లుకోవాలిఆదరించుకోవాలి దీనిలో ఒకరు తక్కువ ఇంకొకరు ఎక్కువ లాంటివి అసలు ఉండకూడదు . కొన్ని వేలమంది మీద జరిపిన పరిశోధనలలో తెలిసింది ఏమిటంటే గొడవపడేటప్పుడు కఠినమైన మాటలు వాడకుండా ఉండడమనేది ఇద్దరి అనుబంధానికి మంచిదని ,అప్పటికప్పుడు కోపంలో అన్న కఠినమైన మాటలు వారి పడక గది లో కూడా ప్రభావం చూపిస్తున్నాయి అని,అవి బంధం బీటలు వారడానికి దారితీస్తున్నాయి అని తేలింది . కాబట్టి ఇద్దరు తగు జాగ్రత్త లు తీసుకోవడం వలన మాత్రమే జీవితం అంత సంతోషం గా గడుస్తుంది .