దేశంలో అంతకంతకు వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కట్టడి చేయడంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్మా థెరఫీ విధానాన్ని ప్రవేశపెట్టాయి. దీంతో కరోనా నుండి కోలుకున్నవారు ప్లాస్మా డొనేట్ చేస్తే ప్రభుత్వాలే ప్లాస్మా డోనార్స్ కి డబ్బులు ఇవ్వటానికి ముందుకు రావటం ఇటీవల మనం చాలా చూశాం. ఇదిలా ఉండగా ప్లాస్మాతో పెద్దగా ఉపయోగం లేనట్టు, ముందుగా ప్లాస్మా తెరఫీ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన ఢిల్లీ రాష్ట్రం నుండి కామెంట్లు వస్తున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే ఢిల్లీ రాష్ట్రంలో పేరు గాంచినా హాస్పిటల్ ఎయిమ్స్ ప్లాస్మా తో పెద్దగా ఉపయోగం లేదు అన్నట్టుగా ఆ సంస్థ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఇటీవల ప్లాస్మా ట్రీట్మెంట్ ఫలితాలను అంచనా వేసేందుకు 15 మంది కోవిడ్ రోగులతో కూడిన రెండు బృందాల పై పరిశీలన జరిపినట్లు వెల్లడించారు. అందులో ఒక బృందానికి సాధారణ విధానంలో ట్రీట్మెంట్ ఇవ్వగా…. మరో 15 మందికి సాధారణ ట్రీట్మెంట్ తో పాటు ప్లాస్మా చికిత్స అందించినట్టు…. దీంతో ఫలితాలు చూస్తే ప్లాస్మా థెరఫీ వల్ల కరోనా రోగులకు ఎలాంటి ప్రమాదమూ లేదు, అదే రీతిలో ప్రయోజనం కూడా పెద్దగా లేదని పేర్కొన్నారు.