కుండలో నీళ్ళు చల్లబడడంతో పాటూ మినరల్స్, విటమిన్స్ని కలిగి ఉంటాయి. అందుకే, ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటి కంటే కూడా, కుండ లో చల్లబరిచిన నీరు ఎక్కువ ఆరోగ్యం . కుండ ఎందుకు కారుతుందో, కుండలోనీళ్లు ఎందుకు చల్లబడతాయో తెలుసుకుందాం . మట్టికుండలను మట్టితో తయారు చేస్తారనే విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వాటికి మన కంటికి కనిపించని అతి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీని వల్ల కుండల్లో నీటిని పోయగానే ఆ నీరు కుండకు ఉన్న సూక్ష్మ రంధ్రాల్లోకి వెళ్లి లోపల ఉన్న నీటి నుంచి వేడిని గ్రహించి బయటకు ఆవిరవుతుంది. ఇలా ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. దీంతో కుండల్లో ఉన్న నీరు క్రమంగా వేడి తగ్గిపోయి చల్లబడుతుంది. అలా కుండల్లో ఉండే నీరు చల్లగా మారుతుంది. అయితే, కుండ పాతబడిపోతే రంధ్రాలు మూసుకుపోతాయి.అందువల్ల నీళ్లు చల్లగా అవడం తగ్గుతుంది. అందువల్లే ప్రతి వేసవికి కొత్త కుండ కొంటారు.
ఒక్క వడ దెబ్బ నుంచే కాదు, అతి దాహం, ఒళ్ళు పేలడం, వంటి సమ్మర్ లో వచ్చే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కుండలో నీళ్ళు మనల్ని రక్షిస్తాయి. ఎందుకంటే, కుండలో నీళ్ళు చల్లగా ఉండడమే కాదు, అవి శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తాయి. అందుకని ఫ్రిజ్ లో నీళ్ళ లాగా ఇవి తాగితే దగ్గూ, జలుబూ రావు. ఆస్తమాతో బాధపడేవారికి ఈ నీటి వల్ల ఆ ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. మట్టి కుండ నీటికి ఉన్న పీహెచ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తుంది. అందువల్ల ఈ నీటిని తాగితే ఎసిడిటీ లాంటి గాస్ట్రిక్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇది అందరికీ అందుబాటు ధరలో దొరుకుతుంది.అందుకే వేసవిలో మాత్రమే కాకుండా రెగ్యులర్గా ఈ నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.