దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి.శఠగోపం లేక శడగోప్యం అంటే అత్యంత గోప్యామైనది. శఠగోపం ను వెండి, రాగి, కంచుతోతయారుచేస్తారు. శఠగోపాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే వలయాకారంలో ఉంటుంది. దానిపై పాదాలు ఉంటాయి. స్వామి పాదాలు నేరుగా తల పై పెట్టొచ్చు కదాఅనిమనకు సందేహం కలుగుతుంది. దానికి మన శాస్త్రాలలో ఒక లెక్కుంది. అది ఏంటంటే నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వలయాకారంలో ఉండే శఠగోపం పైన విష్ణు పాదాలు అమర్చడం జరిగిందంట. అంటే మన కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలి.
పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. దీని అర్థం మన కోరికే శడగోప్యము. అది మన తల పై పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ప్రశాంతత వస్తుంది. చాలామంది దేవుని దర్శనం చేసుకున్నాక ఒక ప్రశాంత ప్రదేశం చూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు. మనుషులకు శత్రువులైన క్రోధము, లోభము, కామము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి దూరంగా ఉంటామని, తలుస్తూ తల వంచి స్వామిని కోరుకోవటం అని మరో అర్థం.
షడగోప్యం తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధికవిద్యుత్ బయటికి వెళ్తుంది. అలా జరగడం వలన శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గుతాయి షడగోప్యమును శతగోపనం అని కూడా అంటారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?