సీ ఫుడ్స్ లో రొయ్యలు కూడా ఒకటి.. రొయ్యలు మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంది ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా అంతా కాదు రొయ్యలతో రకరకాల వంటలను చేసుకుని తింటూ ఉంటారు.. రొయ్యల పచ్చడి కూడా మాంసాహార ప్రియులు లొట్టలేసుకుంటూ లాగించేస్తారు.. కానీ ఆ పచ్చడిని ఎక్కువగా కొనుక్కుని తింటూ ఉంటారు.. రొయ్యల పచ్చడిని టేస్టీగా, హెల్తీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు.. పైగా ఈ పచ్చడి రెండు నెలలపాటు నిల్వ కూడా ఉంటుంది.. ఆ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
రొయ్యల పచ్చడి తయారీ విధానం..
కావలసిన పదార్థాలు..
రొయ్యలను శుభ్రం చేసి పొట్టు తీసిన రొయ్యలు – అరకిలో, నూనె 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చెంచాలు, ఉప్పు రెండు చెంచాలు, కారం 4 స్పూన్స్, నిమ్మకాయలు పెదవి -2, లవంగాలు నాలుగు, ధనియాలు ఒక చెంచా, యాలుకలు రెండు, దాల్చిన చెక్క చిన్న ముక్క, పసుపు ఒక చెంచా..
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఒక చెంచా ఉప్పు, అర చెంచా పసుపు వేసి కలిపి మూత పెట్టి అరగంట పాటు ఉంచాలి.. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు అన్నింటినీ వేసి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి..
స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఉన్న నూనె పోయాలి.. నూనె బాగా వేడెక్కాక అందులో పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా ఎర్రగా వచ్చేవరకు వేయించుకోవాలి. రొయ్యలు బాగా వేగిన తర్వాత వేరు ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి.. ఇప్పుడు అదే నూనె లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది రంగు మారే వరకు వేయించాలి.. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. అందులోనే ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కలపాలి.. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రొయ్యలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ రసం పిండుకోవాలి.. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.. అంతే టేస్టీ టేస్టీ రొయ్యల పచ్చడి తినడానికి రెడీ.. ఈ పచ్చడి అన్నం, చపాతీ, బిర్యానీ లోకి చాలా బాగుంటుంది.. లొట్టలేసుకుంటూ తినేస్తారు ఒక్కసారి రుచి చూస్తే.. రొయ్యల పచ్చడి మీరు కూడా ట్రై చేయండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?