ఈ సీజన్ లో నేరేడు పండ్లు చాలా విరివిగా లభిస్తూ ఉంటాయి. ఈ నేరేడు పండ్ల వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఎందుకంటే నేరేడు పండ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, పిండి పదార్థాలు,ప్రోటీన్స్,పాస్పరస్, ఐరన్ వంటి. చాలా రకాల పోషకాలు సమృద్దిగా ఉంటాయి.అలాగే నేరేడు పండ్లు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. ఫలితంగా సీజనల్ వ్యాధులు ఏవి రావు.వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మెదడుకు, గుండెకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా కాలేయ పనితీరును మెరుగుపరిచి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.అయితే నేరేడు పండ్లను కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తింటే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్స్ వస్తాయి.
నేరేడు పండు తినే ముందు తీసుకోవలిసిన జాగ్రత్తలు:
నేరేడు పండు డయాబెటిస్ ఉన్నవారికి ఒక వరం అనే చెప్పాలి.ఈ పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. నిజానికి నేరేడు పండ్లు తిన్నా తరువాత చాలా మంది నీటిని తాగుతూ ఉంటారు.కానీ అలా నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా నేరేడు పళ్ళు తిన్నా తర్వాత నీళ్లు తాగితే గ్యాస్ ఫామ్ అవ్వడం లేదంటే కడుపు ఉబ్బరం రావడం వంటి సమస్యలు వస్తాయి.
ఇది తిన్నాక తినకూడని పదార్ధాలు :
అయితే నేరేడు పండ్లు తిన్న అరగంట తర్వాత నీటిని తాగితే మంచిదట.అలాగే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కూడా నేరేడు పండ్లను తినకూడదు.ఎందుకంటే నేరేడు పండ్లు కాస్త తియ్యగా, పుల్లగా, వగరగా ఉంటాయి. అయితే కాళీ కడుపుతో పుల్లగా ఉండే వాటిని తింటే గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అదే భోజనం అయిన తర్వాత తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సులువుగా జరుగుతుంది.అలాగే నేరేడు పండ్లను తిన్న తర్వాత పాలు మరియు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.నేరేడు పండ్లను తిన్న తర్వాత పాల ఉత్పత్తులను తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, కడుపునొప్పి వంటి జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.ముఖ్యంగా భోజనం తర్వాత ఈ పండ్లను తింటే జీర్ణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.