ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రజలు ఎంతగా బయపడుతున్నారంటే వారికీ జరగవలిసిన సర్జరీస్ కూడా వాయిదా వేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలా సర్జరీస్ వాయిదా వేసేవారిలో.. కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, వాల్వ్ రీప్లేస్మెంట్/రిపెయిర్ వంటి ఎలెక్టివ్ సర్జరీలు చేయించుకోవాల్సిన వారు కూడా ఉన్నారు. వీరందరూ కరోనా సోకుతుందేమో అన్న భయంతో హాస్పిటల్ కి వెళ్ళడానికి సందేహిస్తున్నారు. ఆ సందేహమే ప్రస్తుతం వారికీ ప్రాణాంతకమౌతోందంటున్నారు నిపుణులు.
ఇలా వెనకడుగు వేస్తున్న వారి ఆరోగ్యం ఇంకా దిగజారుతోందని చెబుతున్నారు.అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ.. వారానికి మూడు నాలుగు సర్జరీలు చేస్తున్నట్లు తెలియచేసారు. అవసరమైతే, కొవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం పేషెంట్స్ కి హార్ట్ సర్జరీలు కూడా చేస్తున్నారు. వారు తీసుకుంటున్న జాగ్రత్తలేమిటో చూద్దాం.
హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్, విజిటర్స్ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. హాస్పిటల్ లో పేషెంట్ కి సహాయం అందించే ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు తప్పని సరిగా ధరించాలి.
పేషెంట్స్, వారితో పాటూ వారికీ సహాయం కోసం వచ్చే వారికి హాండ్ శానిటైజర్స్ ఇవ్వాలి. వీరందరూ ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.
ఎక్కువ మంది తిరిగే ప్రదేశాలని ఎక్కువగా శుభ్రంచేయడం, డిసింఫెక్ట్ చేయడం కంపల్సరీ.
మొత్తం మెడికల్ ఎక్విప్మెంట్ ని డిసింఫెక్ట్ చేయాలి.
పేషెంట్స్ సంగతి చూసే మెడికల్ సిబ్బంది అందరికీ పీపీయీ వాడడం తప్పనిసరి.
కరోనాకి భయపడి సర్జరీ చేయించుకోకపోవడం కంటే, అన్ని జాగ్రత్తలతో సర్జరీ చేయించుకోవడమే మంచిదని నిపుణుల సూచన.కాబట్టి భయం తో సర్జరీ చేయిన్చుకొని వారు ఎవ్వరైన ఉంటె భయాన్ని వదిలి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సర్జరీలు చేయిన్చుకుని ప్రాణ హానినుండి బయట పడండి .