మనకి ఆరోగ్యం కావాలంటే సమయానికి అది కూడా పౌష్ఠిక ఆహారంతీసుకోవాలి . మనం ఎలాంటి ఆహారం తింటున్నాం అన్న దాన్ని బట్టీ,మన ఆరోగ్యం యొక్క బాగు ఆధార పడి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలిసిన విషయం . ఈ రోజు ల్లో చాలా మంది కి ఎక్కువ ఇష్టమైన ఆహారం అంటే వేపుళ్ళు , ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, నూనె పదార్థాలు, ఐస్క్రీమ్ల, కేకులు, కూల్ డ్రింకుల అని చెప్పక తప్పదు. ఇంకా చెప్పాలంటే తినడమే ఆలస్యం అన్నట్టుగా ఆహారాన్ని వండేసి ప్యాకెట్ లో పెట్టేసి సిద్ధం గా ఉంచుతున్నారు. కాని అది ప్రమాదకరమైన ఆహారం గానే చెప్పాలి.
మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో, అది సరైనది అవునా కాదా తెలుకోవాలిసిన బాధ్యత అందరిదీ. దానికి కారణం ఈ కాలంలో వస్తున్న రకరకాల వ్యాధుల కు ఈ ప్రాసెసింగ్, ప్యాకింగ్, ఫాస్ట్ ఫుడ్ డే కారణమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇంకా భయపెట్టే అంశం ఏమిటంటే, మనం ఇళ్ల లో చేసుకునే కొన్ని ఆహారాలు కూడా మనకు హాని కలిగిస్తాయట. అంటే, వాటిని మళ్ళి , మళ్ళి రోజూ తీసుకోకూడదు . అలా చేస్తే మూత్ర పిండలా లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది .
ఇంతకూ అలా ఎక్కువగా తీసుకోకూడని ఆహారం ఏమిటో తెలుసుకుందాం.ఈ మధ్య క్యాప్సికం వాడకం బాగా ఎక్కవ గా ఉంది. దానికి కారణం ఈ సిమ్లా మిర్చి వలన కూర కి అదనపు రుచివస్తుంది. అయితే ఇందులో ఓక్సాలేట్ క్రిస్టల్స్ ఉంటాయని గుర్తించాలి. ఈ క్రిస్టల్స్ శరీరం లోకి వెళ్లి, కాల్షియం తో కలిసి కాల్షియం ఓక్సాలేట్ బాండ్స్ ఏర్పడే లా చేస్తాయి. ది హెల్త్ రిపోర్ట్ ప్రకారం ఎవరైనా ఎక్కువగా కాప్సికం వాడుతూ ఉంటే, వారికి కిడ్నీ లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది అని తెలిపింది.
ఇక చాక్లెట్ అనేది చిన్న దైనా, పెద్ద దైనా ఏదైనా కూడా తిన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. అయితే ఇక్కడే మనం ఓక విషయం గుర్తుంచుకోవాలి. అది ఏమిటంటే చాక్లెట్ల లో ఆక్సలేట్ ఉంటుంది. ఒక మనిషికి కిడ్నీ సమస్యలు ఉన్నా,కిడ్నీలో రాళ్లు ఉన్నాకూడా వారు చాక్లెట్లకు ఎంత దూరం గాఉండగలిగితే అంత మంచిది. చాక్లెట్ల ను ఎక్కువగా తినడం వలన కిడ్నీ సమస్యలు ఎదురుక్కోవలిసిందే. టమాటాలు కూడా ఈ జాబితాలో లో ఉండటంబాధ పడవలిసిన విషయం.
సహజంగా ప్రతి ఇంటిలో రోజూ టమాటాల ను వంట లలో ఉపయోగిస్తూఉంటాము.అయితే టొమాటో గింజ ల్లో ఆక్సలేట్ ఉండి అది ఆహారానికి రుచిని ఇస్తుంది. అదే ప్రక్రియ లో కిడ్నీ ల కు రాళ్లను కూడా ఇస్తుంది. అందుకే టమాటా లను రోజూవాడవలిసి వచ్చినా కూడా ఎక్కువగా కాకుండా, అవసరమైనంతే వాడుతూ ఉండడం వలన పెద్దగా సమస్య ఉండదు. సముద్ర ఆహారం లో ప్రత్యేక పారినిస్ ప్రచూర్ పదార్థాలుంటాయి. సముద్ర చేపలు, ఇతర ఆహారాలు రోజూ తింటే, యూరిక్ యాసిడ్ ఎక్కువగా శరీరం లో చేరి, కిడ్నీల్లోకి వెళ్లి రాళ్లుగా మార్పు చెందుతుంది. కిడ్నీ లో రాళ్లు ఉంటే ఆ నొప్పి భరించడం కష్టం. కాబట్టి ఈ ఆహారాల ను ఎక్కువగా వాడకుండా తగు జాగ్రత్తలుతీసుకుంటే మంచి ఆరోగ్యం మనసొంతమవుతుంది.