Couples : 1.“ఓం దేవేంద్రా ణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే”అనే
మంత్రాన్ని ప్రతి రోజు 1 గంట లేక 108 సార్లు చొప్పున 21 రోజుల పాటు చదువుకోవాలి.
2. ఆడ పిల్లలు ఉత్తమ భర్తను పొందటానికి
.హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా
తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్ అంటూ భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని ప్రతి రోజు కుదురుతుంది అంటే 1 గంట పాటు కుదరదు అనుకుంటే మాత్రం 108 సార్లు 21 రోజులు చదువుకుంటూ ఉండాలి .
3…స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కలగడం కోసం
“విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః”
ఈ మంత్రాన్ని ప్రతి రోజు 1 గంట లేదా 108 సార్లు 21 రోజులు పాటు చదువుకుంటూ ఉండాలి.
4… కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న భర్తను మార్చుకోవడానికి
శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం”
మంత్రాన్ని ప్రతి రోజు 2 గంటలు లేదా 108 సార్లు 40 రోజుల పాటు చదువుకోవాలి.
5.భాగవతానికి దశమస్కంధం అనేది ఆయువుపట్టు గా చెప్పా బడింది. ముందు భాగాన్ని రుక్మిణీ కళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో ఉన్న రుక్మిణీ కళ్యాణం కేవలం విన్న, భక్తి శ్రద్ధలతో రుక్మిణీ కళ్యాణం జరిపించిన , కళ్యాణం జరుగుతున్నప్పుడు చూసిన , ఆ కథను చదివినందు వలన వచ్చే ఫలితం చెప్పడానికి మాటలు సరిపోవు అంతటి మహిమాన్వితమైనది. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు వచ్చి తీరుతాడు.ఆలా ఇప్పటికి పొందినవారు ఎంతో మంది ఉన్నారు.