ప్రేమ లో విఫలమైనా, విడాకులు తీసుకున్నా, ఉద్యోగం పోయినా, వర్క్ ఎక్కువై నా… జీవితం ఒత్తిడి మయం అయిపోతుంది. దేని పైనా ఆసక్తి ఉండదు. ఏ పని చెయ్యాలనిపించదు. చిరాకు, అసహనం ఎక్కువ అవడం తో పాటు కోపం పెరుగుతుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ ఇవన్నీ మెదడు యొక్క నరాల పై ప్రభావం చూపిస్తాయి.
దానిఫలితం గా మెల్లమెల్లగాజ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అది కాస్తా అల్జీమర్స్ వ్యాధి కి దారి తీస్తుంది . మధ్య వయసు స్త్రీ ల లో ఇలా ఎక్కువగా జరుగుతున్నట్లు తాజా పరిశోధన లో వెల్లడైంది.ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ గెరియాట్రిక్ సైకియాట్రీలో ఈ పరిశోధన వివరాలు తెలిపారు. పురుషుల తో పోల్చి చూస్తే స్త్రీలు మధ్య వయస్సు లోకి రాగానే ఒత్తిడి హార్మోన్ల తీవ్రతను పెంచుతూ, మెదడు ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయట. అందువల్ల మధ్య వయస్సు స్రీలు ఎక్కువగా ఆల్జీమర్స్ కి గురవుతున్నారు.
అల్జీమర్స్ అసోసియేషన్ ప్రకారం 60 ఏళ్లు దాటిన ప్రతీ ఆరుగురుస్త్రీలల్లో ఒకరికి అల్జీమర్స్ ఉంటోంది. అదే పురుషుల విషయం లోప్రతీ 11 మందిలో ఒకరికి అల్జీమర్స్ వస్తోంది. ఈ అల్జీమర్స్ వ్యాధి తీవ్రత ను అడ్డుకునే ట్రీట్మెంట్ ప్రస్తుతానికి లేదు. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి ని బట్టి ఒత్తిడి తప్పదు . ఐతే… ఒత్తిడి ఉంది కదా అని దానికి లొంగి పోకూడదు. ధైర్యంగా పోరాడాలి.
ఎలాంటి ఒత్తిడినై నా ఎదుర్కోవడానికి పూర్తి నమ్మకం తో ప్రయత్నం చేయాలి. ఈ ఒత్తిళ్లు నన్ను ఏమీ చెయ్యలేవు … అని మనసులో బలంగా అనుకోవాలి. అలా మనమనస్సుని మనమేఒత్తిడి లేకుండా చేసుకోవాలి. అమెరికా జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సింథియా మన్రో టీమ్ దాదాపు 900 మంది డేటాను సేకరించి పరిశీలించింది. ఆ 900 మందిలో 63 శాతం మంది స్త్రీలే. వారందరు ఇంచు మించు గా వయసు 47 సంవత్సరాలు గా ఉన్నవారే.
మామూలుగా ఒత్తిడి విషయంలో మన శరీరం లో కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఒత్తిడి తగ్గిపోగానే ఆ హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఐతే అదే పనిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటే, హార్మోన్ల స్థాయి ఎక్కువైపోతుంది. పరిస్థితులు అదుపు తప్పుతాయి. వీలైనంత వరకూ ఒత్తిడి లేకుండా చూసుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్లు. యోగా లాంటివి చెయ్యాలనీ, ఇష్టమైన పాటలు వినాలనీ, ఇష్టమైన పనులమీద ధ్యాస పెట్టలని.. మెదడు కు బలాన్ని ఇచ్చే ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ లాంటి ఆహారం లో తీసుకోవాలని సూచిస్తున్నారు.