ఉదయం లేవగానే పరగడువున రాగిపాత్రలోని నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. ఈ నీరు తాగడం వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుందంటున్నారు. మన శరీరంలో నీరు డెబ్భై శాతం ఉంటుంది. ఈ నీటి కన్నా రాగి పాత్రలో నిల్వ చేసుకొని తాగడం మంచిదని ఆయుర్వేదంలో చెప్పారు. రాగి పాత్రలోని నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
*రాగి పాత్రలో నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. రాగికి బ్యాక్టీరియాను నశింప చేసే గుణాలు ఉన్నాయి. కాబట్టి అల్సర్, ఇన్డైజేషన్, ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా ఉంటాయి. ఇంకా కడుపును క్లిన్ చేసి డీటాక్స్ చేయడంలో, లివర్, కిడ్నీ లు బాగా పని చేయడానికి సహాయపడుతాయి. బాడీలో ఉన్న వేస్టును బయటికి పంపడంలో రాగి సహాయం చేస్తుంది.
* రాగి కొవ్వును కరిగించి ఎఫెక్టివ్ గా ఎలిమినేట్ చేసి కొవ్వును శరీరంలో ఉండ కుండా చేస్తుంది. అందుకే బరువు తగ్గుతారు. ఇంకా శరీరానికి హాని చేసే మోల్డ్స్, ఫంగై, ఆల్గె, బ్యాక్టీరియా వంటివి అన్ని చనిపోతాయి. ఫలితంగా నీరు స్వచ్చంగా మారుతుంది.
* రాగి పాత్రలోని నీళ్లు తాగడం వల్ల గాయాలు మానుతాయి. ఎందుకంటే రాగిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇంప్లేమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి.కొన్ని ఆహార పదార్థల ద్వారా శరీరానికి రాగి అందుతుంది. రాగి పాత్రలో నిల్వచేసి నీటిని రోజుకు రెండు లేదా మూడు గ్లాసులు తాగడం వల్ల శరీరానికి రాగి అందుతుంది.
* రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. ముఖం మీద ఫైన్ లైన్స్ రాకుండా రాగి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.
* రాగి గుండె సమస్యలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి బ్లడ్ ప్రెజర్ ను కూడ తగ్గిస్తుంది.
* రాగిలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తాయి.
* థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లకు రాగి తక్కువగా ఉంటుంది. కనుక రాగి పాత్రలోని తాగడం వల్ల శరీరానికి రాగి అందుతుంది.
* ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడేవారు రాగి పాత్రలోని నీళ్లు తాగితే రిలీఫ్ గా ఉంటుంది. ఎందుకంటే రాగిలో యాంటీ ఇంప్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి.