మనకు బాగా వేడి చేసినప్పుడు ఏమి తోచదు.. మూత్రం లో మంట, మలబద్ధకం ,తల నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు మెడిసిన్పై ఆధార పడకుండా సహజంగా నే శరీర యొక్క వేడి సమస్య ను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. తరుచుగా మనం తీసుకునే ఆహారం, ఇతర ఆహారపు అలవాట్లతో శరీరం లో ఉండే అధిక వేడిని తగ్గించవచ్చు.
వేడిని తగ్గించేందు కు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. ఎక్కువగా నీరు తీసుకోవాలి. అయితే, ఇది ఫ్రిజ్ లో పెట్టిన నీరు కాదు.మామూలు నీటిని మాత్రమే తీసుకోవాలి.వేడిని తగ్గించడం లో నీరు పనిచేసినట్టుగా మరి ఏది పని చేయదని నిపుణులు చెప్పే మాట.నీటిని ఎక్కువ తాగలేము అనుకుంటే మాత్రం మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి . ఇలా చేస్తుంటేనెమ్మదిగా వేడి తగ్గుతుంది.
కర్బూజా పండ్లకు చలవ చేసే గుణం అధికం . కర్బూజా పండు మందపాటి తోలు తీసేసి, చిన్న ముక్కలుగా తరిగి, పంచదార చల్లుకుని తింటే క్షణాలలో వేడి తగ్గుతుంది. అరటి పళ్లు, పుచ్చకాయ, బొప్పాయకాయ, యాపిల్, గసగసాలు, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం, చలవచేసే వాటిలో చాల ముఖ్యమైనవి.
గ్లాసు వేడిపాలు తీసుకుని అందులో 2 లేక 3 చిన్న చిన్న పచ్చకర్పూరం పలుకులు, కొంచెం యాలుకల పొడి, తగినంత గసగసాల పొడి కలుపుకుని రాత్రి పడుకోబోయే ముందు తాగితే వేడి మాయమవుతుంది. మంటలు తగ్గుతాయి. చక్కని నిద్ర పడుతుంది. శరీరానికి తేలికదనం వస్తుంది. మనసుకు కూడా ఆహ్లాదం కలుగుతుంది. అయితే పదేపదే గసగసాలను వాడితే వాటికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది.బాగా అవసరం అనుకున్నప్పుడే ఇది వాడాలని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు .