Instant Dosa: దోశ ఈ పేరు వినగానే నోట్లో లలాజలం ఊరుతుంది కొందరికి.. వేడివేడిగా రెండు రకాల పచ్చళ్ళు, కారంపొడితో దోశ తింటే ఆ మజానే వేరు.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అట్టుపిండి తయారు చేసుకుని వేసుకునెంత ఓపిక తీరిక లేకుండాపోయింది..! అలా అని బయట దొరికే అట్టుపిండి అంతా రుచిగా ఉండదు.. ఇన్స్టంట్ దోశ పిండి క్షణాల్లో ఇంట్లోనే తయారు చేసుకుని.. దోరగా కాలుచ్చుకుని వేడి వేడిగా లాగించేయండి..! ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
ఇన్స్టంట్ దోశకి కావలసిన పదార్థాలు..!
రెండు కప్పులు బియ్యం పిండి, ఒకటిన్నర కప్పు పెరుగు, నూనె అర కప్పు, ఉప్పు తగినంత, నీళ్లు సరిపడినంత అవసరం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యప్పిండి, పెరుగు, ఉప్పు వేసి కలపలి. ఈ పిండిలో తగినన్ని నీటిని పోసి పిండి కలుపుకోవాలి. అంతే ఇన్స్టంట్ అట్టు పిండి సిద్ధం. పొయ్యి వెలిగించి పాన్ మీద అట్టు వేసుకుని దానిపై నూనె వేసి దోరగా కాల్చుకోవాలి రెండు వైపులా. అంతే వేడివేడిగా ఇన్స్టంట్ దోశ తినడానికి రెడీ..
ఈ ఇన్స్టంట్ దోశ లో కొబ్బరి పచ్చడి, గ్రీన్ చట్నీ తో సర్వ్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారు. అదే ఇన్స్టంట్ దోశ పై కారంపొడి వేసి నెయ్యి వేసి ఇంకాస్త దోరగా కాల్చి అందిస్తే ప్రతి సారి ఈ దోశె కావాలని మరి అడిగి తింటారు. బయట ఫుడ్స్ కంటే కూడా ఇంట్లో కమ్మగా వండి పెడితే ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?