ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని చర్మం, జుట్టు గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మార్కెట్లో దొరికే అన్ని రకాల ప్రాజెక్ట్ ని ట్రై చేసి ఉంటారు. కానీ వాటిలో కొన్ని మన శరీరానికి సరిపోతాయి, మరికొన్ని పడవు. కాని సహజ సిద్ధంగా దొరికే వాటివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు.
ప్రతి ఇంట్లో సహజ సిద్ధంగా దొరికే ఈ బియ్యపు నీరు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? ఈ నీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మేరవడమే కాకుండా, జుట్టు సమస్యలు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. బియ్యం నీరు వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం. బియ్యాన్ని నీటిలో పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి. వీటితోపాటు ప్రొటీన్లు, లిపిడ్లు, ట్రైగ్లిజరైడ్ ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచడానికి, వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వ్యాధుల బారి నుండి కాపాడడానికి ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి ఏరోబిక్ జీవక్రియలో సహాయపడతాయి. బియ్యం నీటిలో ఉండే ఎనిమిది రకాల అమైనో ఆమ్లాలు కండరాల క్షీణత నివారించడంలో సహాయపడతాయి.
బియ్యం నీటిలో ఉండే పోషకాలు మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడం లో సహాయపడతాయి. బియ్యపు నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగడం వల్ల మనసు ప్రశాంతతను కలిగిఉంటుంది. మన చర్మం మీద మచ్చలు, మొటిమలు, సన్ స్పాట్, మొదలైనవాటితో పోరాడుతుంటే పులియబెట్టిన బియ్యం నీరు ఎంతో సహాయ పడతాయి.
పులియబెట్టిన బియ్యం నీటిలో కాటన్ బాల్ ని ముంచి మచ్చలు ఉన్న చోట బాగా మసాజ్ చేయడం వల్ల మచ్చ ల నుండి విముక్తి కలిగి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అయితే తరచూ ఇలా చేస్తూ ఉండాలి. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం మృదువుగా ఉంచడంలో సహాయపడటానికి కాకుండా, కణాల పెరుగుదల పునరుత్పత్తికి సహాయపడుతుంది. మొటిమలతో బాధపడేవారు బియ్యపు నీటితో తరచూ మొహం కడగడం వల్ల మొటిమల సమస్య తగ్గడమే కాకుండా, చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.
అధికంగా జుట్టు సమస్యలతో బాధపడేవారు బియ్యపు నీటితో అందమైన జుట్టును పొందవచ్చు. ఇది నీటిలో పిండిపదార్థాలు అధికంగా ఉండటం వల్ల జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టు చివరి భాగంలో ఎక్కువగా చిట్లు ఉంటుంది అలాంటి జుట్టును బియ్యపు నీటిలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టి కడగకూడాడం వల్ల అటువంటి సమస్య నుండి విముక్తి పొందవచ్చు. చుండ్రు జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.