Skin Care: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది చర్మం పైన దుమ్ము, ధూళి, కాలుష్యం పేరుకుపోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.. దానికితోడు చర్మం నల్లగా మారుతుంది.. నిర్జీవంగా, కాంతివిహీనంగా కనిపిస్తుంది.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే ఉప్పుతో ఇలా ట్రై చేసి చూడండి..!!
ఈ చిట్కా కోసం ముందుగా సాధారణ ఉప్పు కాకుండా సముద్రపు ను తీసుకోవాలి. అంటే రాళ్ల ఉప్పు అన్నమాట. ఒక స్పూన్ రాళ్ల ఉప్పు ని తీసుకొని అందులో కొద్దిగా తేనె, కొంచెం కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఇందులో రెండు చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్లేవర్ ను ఉపయోగించవచ్చు. ఇది మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి. లేకపోయినా ఫర్వాలేదు. ఇప్పుడు పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి మృదువుగా మర్దనా చేయాలి కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఈ చిట్కా ప్రయత్నిస్తూ ఉంటే చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇంకా గజ్జి, తామర, దురద వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మానికి మునుపటి రంగును సంతరించుకునేలా చేస్తుంది. ఈ చిట్కాలు ఉపయోగించిన అనే పదార్థాలు కూడా మెనీ చాయను పెంచేవే. పైగా స్కిన్ ప్రాబ్లమ్స్ ను నివారిస్తాయి.