వర్షాకాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు, అంటు వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మనలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి.అందుకోసం ఈ వర్షా కాలంలో తప్పనిసరిగా ఈ 5 రకాల పండ్లు తింటే ఆరోగ్యానికి మంచి జరగడంతో పాటుగా రోగ నిరోధక శక్తి కూడా అధికం అవుతుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.మరి ఆ పండ్లు ఏంటో తెలుసుకుందామా.
నేరేడు పండ్లు :
ఈ కాలంలో నేరేడు పండ్లు బాగా పండుతాయి. ఈ నేరేడు పండ్లంటే ఇష్టపడని వారు కూడా ఎవరు ఉండరు. ఇది ఒక సీజనల్ ఫ్రూట్ అనే చెప్పాలి. షుగర్ పేషంట్స్ కు నేరేడు పండు ఒక వరం అనే చెప్పాలి. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి..రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో నేరేడు పండు బాగా ఉపయోగపడుతుంది.విటమిన్ బి, సీతో పాటు కాల్షియం, ఐరన్ కూడా జామూన్ లో అధికంగా ఉంటాయి.
యాపిల్:
ప్రతి రోజు ఒక యాపిల్ పండు తింటే ఎటువంటి అనారోగ్యాలు రావు.ఇందులో విటమిన్ సీ, ఫ్లావనాయిడ్స్ అధికంగా ఉంటాయి.. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి.
దానిమ్మ పండు :
దానిమ్మ పండును పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరు కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరగాలంటే దానిమ్మ తినాలిసిందే.
అరటిపండు:
అందరికీ అందుబాటు ధరలో ఉండే అరటిపండులో విటమిన్ బీ6 చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు ఒక అరటి పండు తింటే ఎటువంటి అనారోగ్యాలు మీ దరికి చేరవు.అరటి పండు తింటే జీర్ణశక్తి మెరుగు అవ్వడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థ కూడా ఎక్కువ అవుతుంది
పియర్స్(బేరి పండు):
బేరిపండులో పొటాషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. బేరి పండు మాత్రమే కాకుండా బేరి పండు యొక్క తొక్క కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.బేరి పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్లావనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.యాపిల్ కంటే ఎక్కువ నీటితో ఉండే పండు ఇది. తియ్యగా,ఎక్కువ ఫైబర్ ను కలిగి ఉంటుంది.