Sesame Seeds: చాలా మంది కాల్షియం లోపంతో ఇబ్బందులు పడుతుంటారు. శరీరంలో కాల్షియం లోపం వల్ల చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. ప్రజలకు ఇటువంటి సమస్యలు చాలా తొందరగానే వస్తుంటాయి. అయితే ఈ సమస్యలు పరిష్కారం కోసం ఆహారంలో మర్పులు చేర్పులు చేసుకోవాలి. కాల్షియం లోపం వల్ల వచ్చే సమస్యల పరిష్కారానికి ఈ చిట్కా వైద్యం చేస్తే సమస్య పరిష్కారం అవుతాయని చెబుతుంటారు.
Sesame Seeds: తెల్ల నువ్వులలో అనేక పోషకాలు
తెల్ల నువ్వులలో అనేక పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తెల్ల నువ్వులను కేవలం వంటల్లోనే కాకుండా నువ్వుల ఉండలు చేసుకుని తింటుంటారు. నువ్వుల పొడిని చాలా రకాలుగా ఉపయోగించుకుంటుంటారు. ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన నువ్వులను తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తే ఏన్నో ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. నువ్వులలో ఉండే జింక్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, వంటివి శరీరంలో కాల్షియం లోపం మరియు ఐరన్ లోపం లేకుండా చేస్తాయి. ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
తెలగపిండి కూర ఆరోగ్యానికి మంచిది
అంతే కాకుండా వయసులో పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. నువ్వులలో బాదం కన్నా ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుందట. తెల్ల నువ్వుల నుండి నూనెను తీయగా మిగిలిన పిప్పిని తెలగపిండి పేరుతో అమ్ముతుంటారు. దీంతో కూర వండుకుని తింటారు. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ కూర చాలా బలవర్ధకమైంది. నువ్వుల గింజల్లో ఉండే ఖనిజాలు రక్తప్రవాహనంలో చేరే అదిక ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభాలను తగ్గించడంతో పాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.