నెలసరి సమయంలో మహిళలకు తగినంత విశ్రాంతి తోపాటు వ్యాయామం అవసరం. ప్రతినెలా వచ్చే ఈ రుతుక్రమ సమయంలోస్రీలు తమ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడంతో పాటు, కొన్ని ఆరోగ్యకరమైన పోషకాహా రాన్ని తీసుకోవాలని గైనకాలజిస్టులు సలహా ఇస్తున్నారు. పీరియడ్ సమయంలో సమయంలో సాల్మన్ చేపలు, అరటిపండ్లు ఇతర పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
ఆడవారికి నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉండటం వల్ల అధిక మొత్తంలో ఐరన్ కోల్పోతారు మెగ్నీషియంని కోల్పోవడం వల్ల మన శరీరంలో అలసట, శారీరక నొప్పి దారి తీస్తుంది. పాలకూర, బచ్చల కూరవంటివాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి వాటిని ఆహారం లో ఉండేలా చూసుకోవాలి. వీటిని తినడం వలన కోల్పోయిన మెగ్నీషియంను తిరిగి పొందవచ్చు. అధిక మొత్తంలో నీరు తీసుకోవడం చాల అవసరం. నెలసరి సమయంలో ఆ నీటిని కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి వంటి వాటి నుండి హైడ్రేట్ చేస్తుంది.
పుచ్చకాయ, దోసకాయ ఖర్భుజా వంటి పండ్లను తీసుకోవడం ద్వారా తీపితినాలనే కోరికలను అరికట్టడమే కాకుండా, డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.చాలామంది నెలసరి సమయంలో పెరుగు తినరు అలాగే తినకూడదా అనిఅంటుంటారు. నెలసరి సమయంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండేవారు పెరుగు వంటి ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, యోనిలో ఉండే మంచి బ్యాక్టీరియాను పోషించి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండారక్షణ కల్పిస్తుంది.
అంతేకాకుండా పెరుగులో ఉండే క్యాల్షియం మెగ్నీషియం, వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మజ్జిగను తీసుకుంటే నెలసరి నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఇంకా డార్క్్ చాక్లెట్స్ ,నట్స్, తినడం వలన స్త్రీలకులకునెలసరి సమయం లో కావాల్సిన శక్తి లభిస్తుంది.