ఆడవాళ్లకు ప్రతి నెల పీరియడ్స్ రావడం అనేది ఒక ప్రకృతి చర్య. అయితే కొన్ని కొన్ని సార్లు పెళ్లిళ్లు జరిగినప్పుడు, ఇంట్లో శుభకార్యాల సమయంలో, పూజల సమయంలో, గుడికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఎక్కడికన్నా ప్రయాణం. చేయాలిసి వచ్చినప్పుడు పీరియడ్స్ ఆలస్యం కావడానికి చాలా మంది మహిళలు మందులు వాడుతూ ఉంటారు. కానీ అలా మందులు వాడడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా కొన్నిసార్లు పీరియడ్స్ రాకుండా మందులు వాడడం వలన రుతుక్రమం ఆలస్యం అవుతుంది.వైద్యపరమైన కారణాలను మినహాయించి వేరే ఏ కారణాల వలన కూడా పీరియడ్స్ ఆలస్యం చేయడం మంచిది కాదు. అలాగే అనవసరంగా మందులు తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
ఈ సమస్యలు ఉన్నవాళ్లు టాబ్లెట్స్ వాడవచ్చు :
థ్రోంబోసైటోపెనియా, అప్లాస్టిక్ అనీమియా వంటి తీవ్రమైన వ్యాధులు ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్లు పీరియడ్స్ ఆపడానికి మందులు ఇస్తారు.ఎందుకంటే ఈ రెండు పరిస్థితులలో రుతు రక్తస్రావం అయితే శరీరంలో రక్తశాతం తక్కువ అయ్యి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి పీరియడ్స్ రాకుండా మందులు వేసుకోమని వైద్యులు సలహా ఇస్తారు.పీరియడ్స్ రాకుండా మందులు వేసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.!
భారీ రక్తస్రావం అయ్యే అవకాశం :
రుతుస్రావం ఆలస్యం అయిన స్త్రీలలో ఎక్కువ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.నిజానికి మందుల ప్రభావం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఒక్కోసారి మందులు వాడుతున్నప్పుడు కూడా రక్తస్రావం జరగవచ్చు.
గర్భ వైఫల్యం:
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి మందులు తీసుకుంటున్న చాలా మంది మహిళల్లో గర్భశ్రావం. అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఒక్కోసారి మందులు వేసుకోవడం వలన తమకు పీరియడ్స్ రావడం లేదని భావిస్తారు కానీ అది గర్భం వలన అని కనిపెట్టలేరు. అలాంటి సందర్భాల్లో మందులు వాడితే గర్భంసంచిపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.
కడుపు నొప్పి:
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి మందులు తీసుకుంటున్న చాలా మంది మహిళలు తీవ్రమైన కడుపు నొప్పి సమస్యతో ఇబ్బందులు పడతారు. అలాగే అధిక రక్తస్రావం అవ్వడంతో ఊరికే నిరసించి పోతారు. కాబట్టి ఏవైనా మెడికల్ సంబందిత కారణాల వలన పీరియడ్స్ రాకుండా మందులు వాడవచ్చు కానీ అనవసరమైన వాటికి మందులు వాడకూడదు.