అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. కానీ వాతావరణ కాలుష్యం, సన్ టాన్, జిడ్డు, మురికి పేరుకోవడం వల్ల ముఖం నల్లగా కనిపిస్తుంది.. వీటిని తొలగించుకోవడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. డబ్బులు వృధా తప్ప ఫలితం కనిపించదు.. ఇంటిలోనే సహజ సిద్ధంగా దొరికే ఈ పదార్థాలతో మీ చర్మాన్ని తెల్లగా మెరిపించవచ్చు.. ఈ ప్యాక్ వేసుకుంటే క్షణాల్లో మెరిసిపోవడం ఖాయం..
ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక బంగాళదుంప, ఒక చెంచా తేనె, ఒక చెంచా ముల్తానీ మట్టి అవసరం.. ముందుగా బంగాళాదుంపని చెప్పి తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బంగాళదుంప ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.. ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్ వేసుకొని బంగాళదుంప రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప రసం పక్కన పెట్టుకోవాలి..
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప రసం, ఒక చెంచా ముల్తానీ మట్టి, ఒక చెంచా తేనె వేసి బాగా ఫేస్ ప్యాక్ లాగా కలుపుకోవాలి.. ముందుగా ఈ ప్యాక్ ని వేసుకునే ముందు ముఖాన్ని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేసుకొని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే ముఖంపై పేరుకుపోయిన సన్ టాన్ మురికి తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.. అంతేకాదు నల్ల మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి వాటిని కూడా తొలగిస్తుంది..