Health: సాధారణంగా ఎక్కువ మంది మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక కునుకు తీయడం అలవాటు. ఇంతకు ముందు ఆఫీసులకు వెళ్లే వారు కూడా ఇప్పుడు కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రొం హోమ్ కారణంగా మధ్యాహ్నం భోజనం తరువాత అలసిపోయి నిద్రపోతున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం మధ్యాహ్నం సమయంలో భోజనం చేసిన వెంటనే నిద్ర పోవడం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. కొందరు మాత్రం మధ్యాహ్నం భోజనం తరువాత నిద్ర పోతే చాలా మంచిదని భావిస్తుంటారు. భోజనం తరువాత నిద్ర రావడం సహజమే కానీ వైద్య నిపుణులు మాత్రం ఇది మంచిది కాదని చెబుతున్నారు.
మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత నిద్ర పోవడం వల్ల కడుపులోని దీన రసాలు గురత్వాకర్షణ శక్తి వల్ల ఆహారం వైపు వస్తాయట. దాంతో ఆమ్ల స్వభావం కారణంగా గొంతులో మంట వచ్చే అవకాశాలు ఉంటాయి. భోజనం చేసిన తరువాత పడుకోవడం వల్ల ఒత్తిడి మొత్తం జీర్ణాశయం పైనే పడుతుందట. దీని వల్ల గురక వస్తుంది. అయితే భోజనం చేసిన గంట తరువాత నిద్ర పోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?