Nitya Diparadhana వృద్ధిలోకి
నిత్యం దీపారాధన చేసేవారికి వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల తొలగి పోతాయి.
ఇంట్లోప్రశాంతత నెలకొనడం తో పాటు పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః
దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః అంటూ దీపాన్ని ప్రార్ధించాలి.
Nitya Diparadhana పితృ దోషాలు
దీపరాధన చేయడానికి ప్రమిదె లో ముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు .. అలా చేయకూడదు.
ప్రమిదెలో ముందుగా నునె పొసితర్వాత వత్తులు వేసుకోవాలి దీపారాధన కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి వాడుకోవాలి. శుభ్రపరచకుండా వత్తులను మాత్రం మర్చి పూజ చేయడం అనేది మంచి పద్దతి కాదు.దీపారాధన చేసిన దీపాల నుంచి కర్పూర హారతులు ,అగరవత్తులు, ఏకహారతి వంటివి వెలిగించకూడదని నిపుణులు తెలియచేస్తున్నారు. మంచి దూదితో చేసిన వత్తుల తో దీపం పెట్టడం వలన ఆ ఇంటి కి పితృ దోషాలు తొలగి పోతాయి . తామర ఒత్తులు ఉపయోగించి చేసిన వత్తులు వేసి దీపం వెలిగిస్తే ఆ మహాలక్ష్మి కి కరుణ త్వరగా కలిగి అప్పుల బాధలు తగ్గుతాయి. అదే అరటినార వత్తులతో దీపారాధన చేసుకున్న ఇంట్లోమంచి సంతానం కలుగుతారు.
ఇంటిపై మాంత్రిక శక్తులు
జిల్లేడు వత్తులతో దీపారాధన చేసుకోవడం వలన,శ్రీ గణపతి అనుగ్రహం పరిపూర్ణం గా కలిగి అధిక సంపద రావడం తో పాటు దుష్టశక్తుల పీడ కూడా వదిలి పోతుంది. కుంకుమ నీటితో, తడిపి ఆరబెట్టిన నూలు వస్త్రం తో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు ఏమున్నా కూడా తొలగిపోవడం తో పాటు ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీకూడా పనిచేయవు.వత్తులను పన్నీటిలో తడిపి ఆరబెట్టి ఆ వత్తులను వేసి ఆవునేతితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణం గా అందుతుంది.వ్యాపార అభివృద్ధి కోరుకునే వారు ప్రతి రోజు వ్యాపారస్థలంలో దీపారాధాన చేసుకోవడం వలన కలిగే మార్పు మీకే తెలుస్తుంది