సాధారణంగా వయస్సు పెరిగిన వారిని మతిమరుపు సమస్య వేధిస్తూ ఉంటుంది. అయితే కొందరిని మాత్రం చిన్న వయస్సులోనే మతిమరుపు సమస్య వేధిస్తుంది. వయస్సు పెరగడం వల్ల వచ్చే మతిమరుపు సాధారణమే అయినా చిన్న వయస్సులోనే మతిమరుపు వస్తే మాత్రం తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుంటే మంచిది. ముఖ్యంగా రక్తపోటుతో బాధ పడేవారు మతిమరుపు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రక్తపోటు అదుపులో లేకపోతే న్యూరో ట్రాన్స్మీటర్లు బలహీనపడి జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంటుంది. మతిమరుపు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే రక్తపోటును అదుపులో ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మతిమరుపుకు చెక్ పెట్టడంలో పుట్టగొడుగులు సహాయపడతాయి. వారానికి రెండుసార్లు పుట్టగొడుగులను తీసుకుంటే మతిమరుపు సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
ఉడికించిన 300 గ్రాముల పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల 50 శాతం వరకు మతిమరుపు సమస్యకు చెక్ పెట్టవచ్చని చెప్పవచ్చు. పుట్టగొడుగుల్లో ఉండే అమినోయాసిడ్ మతిమరుపుకు సులభంగా చెక్ పెట్టడంతో పాటు విశేష ప్రయోజనాలను అందిస్తుంది. కొత్త భాషను నేర్చుకున్నా, పద బంధాలను పూరించినా, వేర్వేరు మలుపులను గుర్తించడం, కథలు, నవలలు చదవడం ద్వారా మతిమరుపు సమస్యకు చెక్ పెట్టవచ్చు.
సోంపు తింటే కూడా మతిమరుపు సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. బెల్లంతో సోంపును తీసుకున్నా మతిమరుపు సమస్య దూరమవుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా మతిమరుపు సమస్యకు చెక్ పెట్టవచ్చు.