Medlar: పండ్లు మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. డాక్టర్లు కూడా పండ్లు తినమని పదేపదే చెబుతూ ఉంటారు.. కొన్ని పండ్లు పచ్చిగా తింటే బాగుంటాయి.. మరికొన్ని పండ్లు పండిన తర్వాత తింటే రుచిగా ఉంటాయి.. అయితే ప్రపంచంలో ఏ పండుకు లేని ప్రత్యేకత.. ఈ పండును ఉంది.. ఈ పండును పచ్చిగా కానీ పండుగా కానీ తినడానికి పనికిరాదు.. కేవలం కుళ్ళిన తర్వాత మాత్రమే తినడానికి ఉపయోగపడుతుంది.. అదే మెడ్లర్ ఫ్రూట్..! ఈ పండు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
యూరప్ కంట్రీ లో మెట్ల రూట్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన గ్రీకు కవిత్వంలో ఈ ఫ్రూట్ ప్రస్తావన కనిపించింది.. క్రీస్తు శకం 800 రాజుల తోటలలో ఈ పండ్ల చెట్టు కచ్చితంగా ఉండేవి.. ఈ పండ్లు చూడటానికి ఉల్లిపాయ రూపంలో పచ్చగా, గోధుమ రంగులో కనిపిస్తాయి. రుచికి మాత్రం ఆపిల్ పండు లాగా ఉంటాయి. అలాగని వీటిని నేరుగా తినేస్తే మాత్రం అనారోగ్యానికి గురి అవుతారని 18వ శతాబ్ది వైద్యులు హెచ్చరించారు .. కానీ వీటిని కొన్ని రోజులపాటు మగ్గపెట్టి ఆ తర్వాత అవి కుళ్ళిపోయిన తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిదని గ్రంధాలలో తెలిపారు..
మెడ్లర్ ఫ్రూట్ లో ఉండే ఏంజైమ్స్, కార్బోహైడ్రేట్స్ మగ్గబెట్టే ప్రక్రియలో బ్లూ కోసే ఫ్రక్టోజ్ గా మారుతాయి వీటివల్ల పుల్లటి రుచి వస్తుంది.. ఈ ప్రక్రియని బ్లేటింగ్ అని అంటారు.. ఈ విధానం వలన ఈ పండు కి పండిన ఖర్జూరాన్ని నిమ్మకాయలతో కలిపితే ఎటువంటి రుచి వస్తుందో అలాంటి టేస్ట్ ను కలిగి ఉంటుంది ఈ పండులో విటమిన్స్ తోపాటు 80 శాతం కంటే ఎక్కువ నీటిని కలిగి ఉన్నాయి.. తక్కువ మోతాదులో చక్కెర ను కలిగి ఉంటుంది. మధుమేహులు వీటిని తింటే చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ ఫ్రూట్ బెస్ట్.