ప్రపంచవ్యాప్తంగా జొన్నలు అధికంగా పండుతాయి.గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత అధికంగా పండే పంట జొన్న.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నలను డైట్ లో చేస్ర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
జొన్నలు బరువు తగ్గుదామనుకునే వారికి , డయాబెటీస్ తో బాధ పడుతున్న వారి,కి చక్కటి ఆప్షన్ . ఒక కప్పు జొన్న లో ఇరవై రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. బాడీకి కావలిసిన శక్తి ఇవ్వడమే కాకుండా సెల్ గ్రోత్ కి సహకరిస్తుంది . అదే విధంగా ప్రోటీన్ తో సమృద్ధమైన జొన్నలలో, పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది . ఈ ఫైబర్ జీర్ణ క్రియ సక్రమంగా ఉండటానికి తోడ్పడుతుంది.
విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది.కాబట్టి శరీరానికి కావాల్సిన శక్తిని జొన్నలు అందిస్తాయి.జొన్నలు అన్ని రకాల దాన్యాలకంటే బలవర్ధకమైనవి. వీటిలో ఉండే పోషకాలు , తల్లికే కాదు .. బిడ్డకు మంచిదే . కాబట్టి పాలిచ్చే తల్లులకు జొన్నలతో చేసిన ఆహారం పెట్టటం మంచిది . జొన్నలతో చాలా ఈజీగా తయారు చేసుకునే పదార్ధం రొట్టెలు . 1 కప్ పిండికి ఒక కప్ నీరు పొయ్యమీద పెట్టి మరగనివ్వాలి . నీరు మరుగుతున్నపుడే చాలకొంచెం ఉప్పు వేసుకోవాలి . నీరు మరుగుతున్నప్పుడు పిండి కొంచెం కొంచెం గా మరుగుతున్న నీటిలో వేసుకుంటూ ఉండలుకట్టకుండా కలుపుకోవాలి . ఇప్పుడు స్టవ్ కట్టేసి పిండి ఉన్న గిన్నె పైన మూత పెట్టి 10 నిముషాలు ఆలా వదిలేయాలి .
ఆతర్వాత చేతిని తడుపుకుంటూ పిండిని వేడిమీద మాత్రమే కలుపుకోవాలి. పిండి వేడిగాఉన్నపుడు కలుపుకోక పొతే రొట్టెలు రావు.పిండి బాగా వేడిగా ఉంటే తడి గుడ్డసహాయంతో కలుపుకోవచ్చు . జొన్న పిండిలో జిగురు ఉండదు.మనం ఎంతసేపు పిండిని కలుపుకుంటే అంత జిగురుగా ఉంటుంది. కనీసం 5నుండి6 నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి.అప్పుడు రొట్టెలు విరగవు మెత్తగా కూడా ఉంటాయి.ఇప్పుడు ఈ పిండిని చిన్న,చిన్న బాల్స్ చేసుకుని చెపాతీలలాగా రోటీలు ఒత్తుకోవటమే. ఇలా చేసి చుడండి రొట్టెలు చాల బాగా వస్తాయి.