మలద్వారం లోపల పక్కన సున్నితమైన రక్త నాళాలు మూత్రానికి వెళ్లేప్పుడు గట్టిగా ఒత్తిడి చేయడం వలన అవి పిలకల్లా బయట పక్క కి వస్తాయి. వాటినే మొలలు లేదా పైల్స్ అంటారు. వైద్య పరిభాషలోవీటిని హేమోరాయిడ్స్గా చెప్తారు .మొలలు ఎందుకు వస్తాయి తెలుసుకుందాం…
నీరు తక్కువగా తాగడం వలన, మాంసాహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నా మొలలు వస్తాయి. ఒకే చోట గంటలు తరబడి కూర్చుని పని చేసేవారిలో ఈ సమస్య బాగా కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి ఎదురుకోవడం, మద్యం తాగడం వల్ల కూడా మొలలు వస్తాయి. మల విసర్జన సమయంలో విరేచనం సాఫీగా అవ్వక లేదా మలబద్దకం సమస్యతో ఎక్కువగా ముక్కేవారికి మొలలు బాధ వస్తుంది. గట్టిగా దగ్గి న కూడా మొలలు ఏర్పడతాయి .మొలలు ఏర్పడినప్పుడు నొప్పి తో పాటు రక్తం కూడా పడుతుంది. అలా రక్తం ఎక్కువగా పోవడం వలన రక్తహీనతఏర్పడి నీరసించిపోతారు.
మొలలు వచ్చిన మొదటి దశలో మల విసర్జన సమయంలోమాత్రమేమొలలు బయటకు వస్తాయి. విసర్జన తర్వాత తిరిగిలోపలికి వెళ్లిపోతాయి.రెండో దశలో బయటకు వచ్చిన మొలలను గట్టిగా చేతి వేళ్ళతో నెడితేనే లోపలికి వెళ్తాయి.ఇక మూడో దశలో మొలలు బయటే ఉండిపోతాయి. ఈ దశలో నొప్పి ఎక్కువగా ఉండి భరించడం చాలా కష్టం గా అనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువగా ఉండడం వలన కుర్చోలేరు, నిలబడలేరు చాల ఇబ్బందిగా ఉంటుంది.
మొలలు క్యాన్సర్కు కూడాదారితీసే పరిస్థితులు ఉన్నాయి.మొలలు తో బాధ పడేవారికి కోపం, విసుగు ఎక్కువగా ఉంటుంది. అందుకే కోపంతో ఊగిపోయేవారిని మూల శంఖ ఉందా అనిఅంటుంటారు. ఆ సమస్యకు ఈ జాగ్రత్తలు పాటించండి: నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా మొలల సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్త పడవచ్చు. మొలలు ఏర్పడినవారు శరీరానికి వేడి చేసే పదార్థాలకు ,ముఖ్యంగా కారం, మసాలాలు, చింతపండు, దుంప కూరలకు చ్చళ్లు, ఊరగాయలు, వేపుళ్ల కు దూరంగా ఉండడం మంచిది. ఈ సమస్య తో బాధ పడేవారు పీచు ఎక్కువగా ఉండే ఆకు కూరలు, కాయగూరలను తినాలి. అలా తినే ముందు ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించడం అవసరం.