సాధారణంగా చేసే వ్యాయామం కంటే భిన్నమైనది, విలక్షణమైనది యోగా. యోగా చేయడం ద్వారా అనేక ప్రయోజానాలు ఉన్నాయని ఇప్పటికే పలు శాస్త్రీయమైన అధ్యయనాల్లోనూ రుజువైంది. అనేక శరీరక సమస్యలతో పాటు మానసికంగా తలెత్తే రోగాలు సైతం యోగా చేయడం ద్వారా తొలగిపోతాయి. దీనిని గుర్తించిన అంతర్జాతీయ సమాజం యోగా డేను సైతం జరుపుకుంటున్నది.
అయితే, ఎక్కవ మంది సాధారణంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో నడుము నొప్పి ఒకటి. వయస్సు పైబడుతున్న కొద్దీ వెన్నెముక సమస్యలూ కొందరిలో విపరీతంగా పెరుగుతుంటాయి. అయితే, యోగాలో కొన్ని రకాలైన ఆసనాలతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎంత బాధకరమైన నడము నొప్పి అయిన సరే ఈ యోగాసనాలు వేయడం ద్వారా తగ్గించుకోవచ్చునని యోగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఆ యోగాసనాలేంటో తెలుసుకుందాం !
నడుము నొప్పిని తగ్గించడంలో శలభాసనం మంచి ఫలితాలు అందిస్తుంది. ఇది తేలికైన ఆసనం కాబట్టి అందరూ దీనిని సులభంగానే వేయగలరు. ఈ ఆసనం వేయడానికి మొదట యోగా మ్యాట్పై బోర్లా పడుకోవాలి. మీ కింది దవడ భాగం, నుదురు నెలను తాకేలా ఉండాలి. అరచేతులు తొడల కింద ఉంచి..కడుపుపై పడుకుని ఆసనాన్ని వేయాలి. తర్వాత, ఎడమ కాలును నేరుగా ఉంచి, 10 అంగుళాలు వరకు పైకి ఎత్తడానికి ప్రయత్నించండి, కానీ మోకాలు వంగకుండా ఉందో నిర్ధారించుకోండి. ఆ తరువాత, కుడి కాలును కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నించండి మరియు చివరగా, ఇదే విధంగా రెండు కాళ్లతో చేయండి. ఈ విధంగా ఆసనం వేస్తున్న సమయంలో శ్వాస తీసుకోవడం, వదలడం చేస్తున్న సమయంలో కాళ్లను పైకి కిందకు కదిలించాలి. గుండె, కడుకు సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదనీ నిపుణులు పేర్కొంటున్నారు.
ఉర్ధ్వ ముఖ శ్వనాసనం కూడా మెన్నునొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది నడుమును వంచడంలో ముఖ్యమైనది. దీనిని ఎక్కవగా చేయడం వల్ల ఊపిరితిత్తులకు సైతం వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ ఆసనం వేయడానికి మోకాళ్లు, చేతులపై ముందుకు వంగుతూ.. చెతులను ధృడం చేస్తూ నడుమును కిందకు దించుతూ..కాలి వేళ్లు, చేతులపై శరీరాన్ని ఉంచి తలను వీలైనంత వెనక్కి పోనిచ్చి ఉంచాలి. ఈ సమయంలో శ్వాసను సాధారణంగానే తీసుకోవాలి. వీలైనంత వరకూ (10 సెకండ్లు) అలాగే ఉండి సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని రోజుకు నాలుగు సార్లు చేయవచ్చు. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ధనురాసనం కూడా శరీరంలో చోటుచేసుకునే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ధనురాసనం అంటే శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం. దీనిని వేయడం ద్వారా ఛాతి భాగం వెడల్పవుతుంది. అలాగే, శరీరాకృతితో మంచి మార్పులు చోటుచేసుకోవడంతో పాటు శరీర వెనుక భాగం కండరాలు బలంగా త యారవుతాయి. అలాగే నడుము నొప్పి కూడా తగ్గుంది. ఈ ఆసనం వేయడానికి మొదట బోర్లా పడుకుని రెండు కాళ్లను రెండు చేతులతో పట్టుకోవాలి. కొద్దిగా శ్వాస పీల్చుతూ.. తలను, కాళ్లను పైకి ఎత్తాలి. పొట్ట మాత్రం నేలపైనే ఉండాలి. వీలైనంత సేపు (దాదాపు 10 సెకండ్లు) ఇలా ఉండలి. తర్వాత సాధారణ స్థితికి వచ్చి మళ్లీ చేయాలి.
చక్రాసనంతో కూడా నడుము నొప్పితో పాటు శరీరంలో కలిగే ఇతర అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇది చక్రం ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనిని చక్రాసనం అంటారు. చక్రాసనం వేయడానికి మొదట వెల్లకిలా పడుకోవాలి. తర్వాత కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి. కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించి నడుమును కూడా ఆనించాలి. అయితే, ఈ యోగాసనాలు సంబంధిత యోగా మాస్టర్లు, నిపుణుల పర్యవేక్షణలోనే సాధన చేయాలి.