ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్-19) కల్లోలం కొనసాగుతూనే ఉంది. చైనా దేశంలో మొదట వెలుగు చూసిన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే అన్నీ దేశాలకుపాకి.. ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఇప్పటికే అన్ని దేశాల్లో కలిపి దాదాపు 14 లక్షల మంది చావులకు కారణమైంది ఈ మహమ్మారి. దాదాపు ఆరు కోట్ల మంది దీని బారినపడి… ఆస్పత్రులు, హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో శాస్త్రవేత్తలు దానిపై ముమ్మరంగా పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైరస్ను అడ్డుకునే టీకాలపైనే కాకుండా.. కోవిడ్-19 లైఫ్ పై కూడా ప్రయోగాలు చేస్తున్నారు. కరోనాను అడ్డుకునే టీకాల తయారీలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదని తెలుస్తోంది. ఎలాగంటే.. కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయరీ కోసం ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. అవి వందల సంఖ్యలోనే ఉన్నాయి.
కానీ చివరి దశకు చేరినవి మాత్రం పదుల్లోనే ఉన్నాయి. వాటిలో మూడో దశ క్లినికల్ జరుపుకుంటున్న వాటిలో అమెరికా కంపెనీలు ఫైజర్, మోడెర్నాలు ఉన్నాయి. అలాగే, రష్యా టీకా, ఆక్స్ ఫర్డ్ టీకా సైతం భారత్లో చివరిదశ ట్రయల్స్ జరుపుకుంటోంది. ఈ మధ్యనే ఆయా కంపెనీలు తమ క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన మధ్యంతర రిపోర్టులను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో మెరుగైన టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదనీ, ప్రస్తుతం చివరి దశలో ఉన్న టీకాల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ శాస్త్రవేత్తలు కుండ బద్దలు కొట్టేశారు.
చివరి దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్న మధ్యంతర రిపోర్టుల పై పలువురు సైంటిస్టులు స్పందిస్తూ.. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా చాలా మందిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు తాము గుర్తించామని తెలిపారు. ఫైజర్ టీకా వేయించుకున్న వారిలో కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, అలసట, వ్యాక్సిన్ ఇంజెక్టు చేసిన ప్రాంతంలో శరీరం ఎర్రపటడం, నొప్పి వంటి లక్షణాలు కనిపించాయన్నారు. ఫైజర్ టీకా తీసుకున్న వారిలోనూ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ,తోనూ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుండటంతో పరీక్షలు నిలిపివేసి.. ఇటీవలే మళ్లీ తిరిగి ప్రారంభించారు. ఇవి అసాధారణమైన ప్రభావాలు కావననీ, ప్రాణాలు నిలపడంలో ఉపయుక్తంగా ఉంటాయని ఆయా కంపెనీలు చెబుతుండటం గమనార్హం.