Diabetes: డయాబెటిస్ ప్రతి 10 మందిలో ఏడుగురు ఈ సమస్య బారిన పడుతున్నారు.. నేటి ఆధునిక జీవన విధానం ఆహారపు అలవాట్లు కారణంగా ఈ సమస్య రోజు రోజుకి విస్తరిస్తోంది.. మధుమేహం రావడానికి మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణం.. రాత్రిపూట మనం తీసుకునే ఆహారంపైనా మన రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమవుతాయి.. ఆ ఆహారాలు ఏంటంటే..!?
భోజనం చేసిన తరువాత తీపి పదార్థాలు తినాలని అనిపిస్తుంది. అలా తినడం కూడా మజాగా ఉంటుంది. కానీ రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాల జోలికి వెళ్ళకూడదు. ఇలా తీసుకోవడం వలన డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాత్రిపూట శారీరకశ్రమ ఏమీ ఉంది. దాంతో గ్లూకోస్ లెవెల్స్ కరిగి షుగర్ వచ్చే అవకాశం ఉంది. రాత్రిపూట ఐస్ క్రీమ్ కూడా తినకూడదు. ఇవి మన నిద్రను భంగం చేస్తాయి. సరిగ్గా నిద్రపోక పోయినా కూడా డయాబెటిస్ వస్తుంది.
నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్ లో ఎక్కువగా కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును పెంచి ఇన్సులిన్ నిరోధకత ను తగ్గించి మధుమేహానికి దారితీస్తుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, క్రూసిఫరస్ కూరగాయలు ఆరోగ్యానికి మంచివైనా రాత్రిపూట తినకూడదు. ఇది మీ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి డయాబెటిస్ రావడానికి దారితీస్తుంది.